తెలంగాణ సర్కారు ఎడ్ సెట్ షెడ్యూల్ ప్రకటించింది. జులై 26, 27 తేదీల్లో ఎడ్ సెట్ నిర్వహించనున్నారు. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎడ్సెట్–2022కు ఈ నెల 7 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వివరాలకు https://edcet.tsche.ac.in, http://www.tsche.ac.in వెబ్సైట్లను చూడవచ్చు.జనరల్ అభ్యర్థులు రూ.650, ఎస్సి, ఎస్టిలు రూ .450 చెల్లించాలన్నారు. రూ.250 ఆలస్య రుసుంతో జులై 1 వరకు రూ. 500 ఆలస్య […]
READ MOREతెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ కు సంబంధించిన పరీక్షల ఫీజుల చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. ఈ రోజు (బుధవారం) నుంచి ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఫైన్ తో ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు అధికారులు. సర్కారు అనుమతి ఇవ్వగానే షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఇటీవల ఫస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చునని స్పష్టం చేశారు. ఈ […]
READ MOREదేశంలోని అగ్రగామి 10 విద్యా సంస్థల వివరాలను ‘అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్ మెంట్స్’ తాజాగా విడుదల చేసింది. ఐఐటీ మద్రాస్ టాప్ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. ఐఐటీ మద్రాస్ వరుసగా మొదటి స్థానం దక్కించుకోవడం ఇది మూడోసారి . ఐఐటీ బోంబే, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ రూర్కీ ,ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ ఖరగ్పూర్ నిలిచాయి.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- హైదరాబాద్ […]
READ MOREతెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణులయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి https://tsbie.cgg.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి […]
READ MOREతెలంగాణలో నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడేండ్లలో లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 60 నుంచి 70వేల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.సోమవారం ప్రగతిభవన్లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. యువతకు మేలుచేకూర్చే నిర్ణయాలు ఎన్నో తీసుకొన్నామని, కొత్త జోనల్ వ్యవస్థే అందుకు నిదర్శమని తెలిపారు. దేశంలోనే నిరుద్యోగం తక్కువ ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని, అయినా బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. […]
READ MOREపదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పరీక్ష పత్రాలను తగ్గిస్తూ నిర్ణయం ప్రకటించింది. ఈ ఏడాది టెన్త్లో 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతో పరీక్షలు ఉండనున్నాయి. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపరే పరీక్ష నిర్వహించనున్నారు.అలాగే హిందీతోపాటు.. ఉర్దూను ద్వితీయ భాషగా ఉత్తర్వుల్లో పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో నెలకొన్ని పరిస్థిల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ […]
READ MOREరాష్ట్ర వ్యాప్తంగా 40 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం కోవిడ్ రూల్స్ పాటిస్తూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న సబిత.. గ్రామపంచాయతీ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో పక్కాగా శానిటేషన్ చేపడుతున్నామన్నారు. ధైర్యంగా పిల్లల్ని స్కూళ్లకు పంపొచ్చని భరోసా ఇచ్చారు.బుధవారం హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. స్కూళ్లల్లో పారిశుధ్యం […]
READ MOREసెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ సర్కారీ బడులు తెరవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా ఎలాంటి హామీలు తీసుకోరాదని చెప్పింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకూడదని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఆన్ లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించింది.సెప్టెంబర్ – […]
READ MOREతెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. గతంలో ఇంటర్లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్కు అర్హులుగా అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ […]
READ MOREసెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
admin August 24, 2021 0 COMMENTSరాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో సుమారు ఏడాదిన్నరగా మూగబోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.30వ తేది లోపు స్కూళ్లను పరిశుభ్రంగా తయారు చేస్తామని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ, […]
READ MORE







