తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’ సినిమా పతాక సన్నివేశాల్లో ‘తోడుగా మా తోడుండి అంటూ ’గుండెను కదిలించే పాటను పాడిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పస్తం మొగిలయ్య కొంతకాలంగా రెండు కిడ్నీలు పాడవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ వరంగల్ సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహిస్తుండగా, మొగిలయ్యకు గుండెపోటు వచ్చింది. దాంతో, కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటీన హైదరాబాద్ తరలించారు. మొగిలయ్య ఏడాది కాలంగా బీపీ, షుగర్తోపాటు రెండు కిడ్నీలు ఫెయిలై […]
READ MOREకేంద్ర జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ పల్లెలు సత్తా చాటాయి. సతత్ వికాస్ పురస్కారాల్లో (DDUPSVP) తెలంగాణలో అత్యధిక అవార్డులను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయితీ గెలుచుకుంది. తాజాగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక సలహాదారు బిజయ కుమార్ బెహ్రా ప్రకటించారు. దీంతో కేంద్రం ప్రకటించిన పుసర్కారాలలో మొత్తం 13 పురస్కారాలను తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఏప్రిల్ 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల అందజేస్తామని, సంబంధిత ప్రతినిధులను ఒక రోజు ముందుగా పంపించాలని […]
READ MOREహైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని సిడిఎంఏ ఆఫీస్లో భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకొనేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్రూఫ్ పాలసీ 2023-28ని మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ‘కూల్ రూఫ్ పాలసీ’ని తీసుకొస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్రూఫ్ ఉపయోగపడుతుంది. హరితహారం కార్యక్రమంలో భాగంగా 240 కోట్ల మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది హైదరాబాద్లో 5 చదరపు కిలోమీటర్ల […]
READ MOREసికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభోత్సవం జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 8న సికింద్రాబాద్ స్టేషన్ లో పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ. తెలుగు రాష్ట్రాల మధ్య ఇది రెండో వందేభారత్ రైలు. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య ఒక వందేభారత్ రైలు పరుగులు తీస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్యన వందేభారత్ రైలు నడవనుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సాధారణ షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ కేవలం నాలుగు […]
READ MOREటీఎస్ ఎంసెట్( TS EAMCET ) పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మారిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షల తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. నీట్, TSPSC పరీక్షల […]
READ MOREనేడు ప్రపంచ అటవీ దినోత్సవం (World Forest Day ) సందర్భంగా ..ప్రపంచంలోని 80శాతం భూ జీవవైవిధ్యానికి అడవులే ప్రధాన కారణమని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విటర్లో ట్వీట్ చేశారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో దోహదపడతాయి. అడవులు లేకపోతే ఈ భూమి ఓ నిర్జీవంతో సమానం. తెలంగాణ ప్రభుత్వం అడవుల రక్షణ, పెంపకంపై ‘హరితహారం’ (HarithaHaaram) కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పార్కులకు పునర్జీవంపోసిన ఘనత మన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ […]
READ MOREతెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీల కేసుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసు సీబీఐకి అప్పగిస్తే నిజనిజాలు బయట పడతాయని తన్క వాదనలు వినిపించారు. ఇప్పటి వరకు ఏఈ, గ్రూప్ 1, ఏఈఈ, డీఏవో పరీక్షలను టీఎస్పీఎస్సీ బోర్డ్ రద్దు చేసిందన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో సమగ్ర విచారణ జరపాలని కోరారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ వివేక్ ధన్కా వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున ఏజీ బీఎస్ ప్రసాద్ వాదించారు. ఈ కేసుకు సంబంధించి సిట్ […]
READ MOREయాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ : మంత్రి గంగుల
admin March 20, 2023 0 COMMENTSయాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. యాసంగి ధాన్యం సేకరణ యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై ఈరోజు అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, కంటైనర్ కార్పోరేషన్ ఈడీ, పౌరసరఫరాల డీసీఎస్వోలు, డీఎంలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో, ఎఫ్సీఐ ఉన్నతాధికారులతో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు రైతాంగానికి 1.21 కోట్ల కోట్లను ధాన్యం సేకరణ ద్వారా అందజేశారని […]
READ MOREలాస్ ఏంజెల్స్ 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ అవార్డు గెలుపొందిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్ర బృందానికి అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి. జక్కన రాజమౌళి , సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్పై దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై తెలుగు పాట ‘నాటు నాటు…’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని భారతీయ సినీ చరిత్రలో తెలుగువాడి […]
READ MOREముఖ్యమంత్రి సీఎం కేసీఆర్కు ఫ్యాక్స్కాన్ సీఈఓ యంగ్లియూ లేఖ రాశారు. కేసీఆర్కు రాసిన లేఖలో ఆయన హైదరాబాద్ ఆతిథ్యం పట్ల థ్యాంక్స్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరఖాలాన్లో ఫ్యాక్స్ఖాన్ పార్క్ పెడుతున్నట్లు యంగ్లియూ ప్రకటించారు. ఈ పార్క్ ఏర్పాటుకు తమ సహకారం కావాలని అన్నారు. మార్చి రెండో తేదీన ఫాక్స్కాన్ చైర్మెన్ యంగ్ లియూ.. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్తో భేటీ అయిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పట్ల మీకు ఉన్న విజన్ నన్ను ఎంతో ప్రేరణకు గురిచేసిందని లియూ […]
READ MORE










