యాదాద్రి సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ మహా పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం పూజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఉత్సవాలలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి పాల్గొన్నారు. వేద పండితులు, పురోహితులు. […]
READ MOREదేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.సోమవారం దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 30 మంది మృతిచెందారు. 862 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత వారం రోజుల నుంచి 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు రెట్టింపవ్వడం కలవరపెడుతోంది. ప్రస్తుతం దేశంలో 16,522 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.కరోనాబారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతుండటంతో రోజువారీ పాజివిటీ రేటు […]
READ MOREఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. 97 శాతం ఓట్లను లెక్కించగా మాక్రాన్కు 58% ఓట్లు రాగా, పెన్కు 42% ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏండ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్ రికార్డు సృష్టించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మాక్రాన్ కు శుభాకాంక్షలు తెలిపారు.భారత్, ఫ్రాన్స్ వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేసేందుకు మరోసారి కలిసి పనిచేద్దామన్నారు ప్రదాని మోడీ. […]
READ MOREఉద్యోగ నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో సభ్యులు, అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో నోటిఫికేషన్లపై.. ముఖ్యంగా 503 గ్రూప్-1 పోస్టుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వివిధ కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలపై టీఎస్పీఎస్సీ నిర్ణయం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు సమావేశంలో తీసుకునే నిర్ణయంతో […]
READ MOREపాకిస్థాన్ విద్యా సంస్థల్లో డిగ్రీ చదివితే, భారత దేశంలో ఉద్యోగాలకు అనర్హులు : యూజీసీ, ఏఐసీటీఈ
admin April 23, 2022 0 COMMENTSఉన్నత విద్య కోసం పాకిస్తాన్కి వెళితే ఇండియాలో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు స్పష్టం చేశాయి.ఉన్నత విద్య కోసం పాకిస్థాన్ వెళ్ళొద్దని సూచించాయి. మన దేశంలో ఉన్న, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు పాకిస్థాన్ వెళ్ళొద్దని తెలిపాయి. పాకిస్తాన్లోని విద్యా సంస్థల నుండి డిగ్రీ పొందిన భారతీయ పౌరులు లేదా భారతదేశంలోని విదేశీ పౌరులు ..భారత దేశంలో ఉద్యోగం లేదా ఉన్నత విద్యను పొందేందుకు అర్హులు […]
READ MOREగోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మరోసారి వాయిదాపడింది. ఏపీ సభ్యుల ఉద్దేశపూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. హైదరాబాద్లోని జలసౌధలో శుక్రవారం మొదలైన ఈ సమావేశానికి తెలంగాణ ప్రతినిధి బృందం హాజరైనా… ఏపీ ప్రతినిధుల కోసం కాసేపు వేచి చూసిన బోర్డు, వారి జాడ లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసింది. ఏపీ సభ్యుల గైర్హాజరుతో మార్చి 11న కూడా భేటీ […]
READ MOREబ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత పర్యటన గురువారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడంతో ప్రారంభమైంది. లండన్ నుంచి నేరుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సబర్మతీ ఆశ్రమంలో నూలు చరఖాను ఎలా తిప్పాలో ఆశ్రమంలోని మహిళలు ఆయనకు వివరించారు. విజిటర్స్ పుస్తకంలో , ఓ అసాధారణ వ్యక్తికి చెందిన ఆశ్రమాన్ని విజిట్ చేయడం గౌరవంగా భావిస్తానని, ప్రపంచాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సత్యం, అహింసా సిద్ధాంతాలను గాంధీ ఎలా వాడరన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని బోరిస్ […]
READ MOREఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా డెక్కన్ హెరిటేజ్ అకాడమీ DHA, ఐకోమోస్ ఇండియా ICOMOS, India (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ వింగ్ ఆఫ్ ఇండియా) మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) సహకారంతో మరియు ముఖ్య అతిధిగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మున్సిపల్&అడ్మినిస్ట్రేషన్(MA&UD) అరవింద్ కుమార్ చార్మినార్ దగ్గర జెండా ఊపి హెరిటేజ్ వాక్ ను ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుండి 8.30 వరకు హెరిటేజ్ […]
READ MOREప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ, ఐకోమోస్ ఇండియా ICOMOS, India (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ వింగ్ ఆఫ్ ఇండియా) మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) సహకారంతో “హెరిటేజ్ పరిరక్షణ మరియు పర్యాటకం” పై అవగాహన సదస్సు ను టూరిజం ప్లాజాలో నిర్వహించారు. . ముఖ్య అతిథిగా యువజన సర్వీసులు, స్పోర్ట్స్, టూరిజం, సంస్కృతి అండ్ పురావస్తుశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి చే దీప […]
READ MOREభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు మంత్రి కేటీఆర్ ఘన నివాళి
admin April 14, 2022 0 COMMENTSభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఘన నివాళులర్పించారు.ఎంత కాలం జీవించామన్నది కాదు. ఎంత గొప్పగా జీవించామన్నదే జీవితం అనే అంబేద్కర్ సూక్తిని మంత్రి కెటిఆర్ తన ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, స్వాతంత్ర్యం వచ్చాక వెనుకబడి దళితులకు ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి దళితబంధు లాంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదని తెలిపారు.
READ MORE










