రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీకి సుప్రీంకోర్టు కొలిజీయం సిఫారసు చేసింది. దీంతో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. మరో వైపు ఢిల్లీ, బాంబే, గుజరాత్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల బదిలీలకు కొలీజియం సిఫారసు చేసింది. 2021, అక్టోబర్లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా నియామకం అయ్యారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కూడా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ […]
READ MOREగ్రీన్ కార్డు లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్లను ఆరు నెలల్లోగా క్లియర్ చేయాలని అమెరికా అధ్యక్ష సలహా మండలి ఏకగ్రీవంగా తీర్మానించింది.ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సిఫారసు చేయనుంది. ఈ సిఫారసుకు అధ్యక్షుడి ఆమోదం లభిస్తే.. అమెరికాలో శాశ్వత నివాస హోదాను కల్పించే గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయ అమెరికన్లకు మోక్షం లభించినట్టే అవుతుంది. భారతీయ అమెరికన్ నేత అజయ్ జైన్ భుటోరియా నేతృత్వంలోని బృందం […]
READ MOREనాటో కూటమిలో చేరాలన్న ఫిన్లాండ్ బాటలోనే తాము కూడా పయనిస్తామని స్వీడన్ ప్రధాని మగ్డలీనా అండర్సన్ ప్రకటించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. నాటోలో చేరేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ దేశంపై రష్యా సైనిక చర్యలను ప్రారంభించింది. మరో వైపు యుద్ధాన్ని సైతం లెక్క చేయకుండా పలు దేశాలు నాటోలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరికకు దరఖాస్తు చేయడం..రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ‘తీవ్ర తప్పిదం’గా రష్యా అభివర్ణించింది.
READ MOREభారత 25 వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి)గా రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. 2025 ఫిబ్రవరి వరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇంతవరకు సీఈసీగా ఉన్న సుశీల్ చంద్ర తన పదవీ కాలం ముగియడంతో శనివారం పదవీ విరమణ చేశారు. భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)లో ఆయన 2020 సెప్టెంబర్ 1 నుంచి ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 12 న కేంద్రం ఆయనను సీఈసీగా నియమించింది
READ MOREబుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశానికి పయనమయ్యారు. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ లోని కుశినగర్ కు ఆయన బయల్దేరారు. తన పర్యటన గురించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నేపాలీ ప్రధాని షేర్ బహదూర్తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. ప్రార్థనలను నిర్వహించిన తర్వాత ఆయన నేపాల్ లోని లుంబినీకి వెళ్తారు. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా సుహృద్భావం సంబంధాలున్నాయని మోదీ పేర్కొన్నారు. బుద్ధుడి బోధనలు ఈ […]
READ MOREటీ హబ్లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.టీ వర్క్స్ ద్వారా అనేక ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్లో 3డీ ప్రింటింగ్పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు.3డీ ప్రింటింగ్ ఆరోగ్య విభాగంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో 3డీ ప్రింటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు భారత్కు చక్కటి అవకాశముందన్నారు.ఉస్మానియాలో ఏర్పాటు కాబోతున్న […]
READ MOREరాష్ట్రంలో పదవ తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఈరోజు నుంచి అందుబాటులో ఉంటాయని ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల్లో మొత్తం 5,08,275 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.
READ MOREటిఎస్ఎస్పిడిసిఎల్(దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ)లో తొలిసారిగా మహిళలను లైన్ ఉమెన్గా తీసుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తొలి లైన్ ఉమన్గా శిరీష అనే యువతి రికార్డులకెక్కింది. ఆమెను మేడ్చల్ సర్కిల్ పరిధిలో జేఎల్ఎంగా నియమించారు. నియామక పత్రాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి ఆమెకు అందజేశారు. 200పై చిలుకు లైన్ ఉమెన్లను ట్రాన్స్కో సంస్థ ఉద్యోగంలోకి తీసుకుందని మంత్రి తెలిపారు. దేశ చరిత్రలో లైన్ ఉమెన్గా ఉద్యోగం ఇచ్చిన సంస్థగా టిఎస్ఎస్పిడిసిఎల్ నిలుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా […]
READ MORE“మన ఊరు – మన బడి”ప్రోగ్రాం.. కోనాపూర్ లో సొంత ఖర్చులతో పాఠశాల శంకుస్థాపన : మంత్రి కేటీఆర్
admin May 10, 2022 0 COMMENTSకామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నానమ్మ ఊరు అప్పర్ మానేరులో, అమ్మమ్మ ఊరు మిడ్ మానేరులో, ఇంకో అమ్మమ్మ(అమ్మ సోదరి) ఊరు కూడా లోయర్ మానేరులో మునిగిపోయిందని కేటీఆర్ గుర్తు చేశారు. బీబీపేట్లో సుభాస్ రెడ్డి పాఠశాల కట్టించినప్పుడు తాను కూడా పోసాన్ పల్లిలో నానమ్మ జ్ఞాపకార్థం బడి కట్టిస్తానని హామీ ఇచ్చాను. అందులో భాగంగా […]
READ MOREమాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్ అయ్యారు. కొండాపూర్లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గత 4 రోజులుగా ఫోన్ స్విచ్ఛాప్ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. నారాయణ స్కూల్స్ సిబ్బంది పాత్రపై పోలీసులు ఫోకస్ పెట్టారు. తిరుపతిలోని నారాయణ ఎస్వీ బ్రాంచ్లో వెలుగులోకి వచ్చింది ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన జరిగింది. నారాయణ విద్యాసంస్థలకు చెందిన గిరిధర్ అనే ఉద్యోగి లీకేజీలో పాత్ర వుందంటున్నారు. పరీక్ష ప్రారంభం అయిన తర్వాత ఉదయం 9.57కి […]
READ MORE










