తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా… సెకండ్ ఇయర్ లో 67.16 శాతం మంది పాస్ అయ్యారు. గతేడాది 70 శాతం సిలబస్తోనే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఫలితాల కోసం tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఆగస్టు […]
READ MOREతెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్తో ప్రమాణస్వీకారం చేయించారు.రాజ్భవన్లో ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. దాదాపు తొమ్మిది నెలల తర్వాత సీఎం కేసీఆర్ రాజ్భవన్కు వచ్చారు. మీడియాకు అభివాదం చేస్తూ సీఎం లోపలికి వెళ్లారు. 2019 లో ఏర్పాటైన రాష్ట్ర హై కోర్టు మొట్ట మొదటి ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ […]
READ MOREఇంటర్మీడియట్ ఫలితాలను మంగళవారం (28వ తేదీన) విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాలను https://tsbienew.cgg.gov.in/, https://results. cgg.gov.in, https://examresults.ts.nic.in లో చూడాలని ఆమె కోరారు. మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురైనా, ఇతర సమస్యల పరిష్కారానికి టోల్ఫ్రీ నం.18005999333ను సంప్రదించవచ్చని మంత్రి సూచించారు.
READ MOREదేశంలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. గడచిన 24 గంటల్లోనే 17,073 కొవిడ్ కేసులు నమోదవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఆదివారం విడుదలైన బులిటెన్ లో 15,940 కేసులు వచ్చాయని తెలిపింది. దాంతో ఒక్క రోజులోనే కొత్త కేసుల సంఖ్య వెయ్యికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ప్రస్తుతం 94,420 యాక్టివ్ కేసులు ఉండగా.. 15,208 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో పేర్కొంది. ఆదివారం ఒక్కరోజే 11,739 కేసులు నమోదయ్యాయి.21 మంది […]
READ MOREమహిళా సంఘాల వస్తువులను ప్రభుత్వం ఇకపై ఆన్లైన్లోనూ విక్రయించనుంది. దీనికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ సాధించిన విషయాల్లో ఇదొక విజయమని ఆయన ప్రశంసించారు. ఈ ఏడాది 500 కోట్ల వ్యాపార లక్ష్యంతో ఈ ఒప్పందం ఫ్లిప్ కార్ట్ తో కుదిరిందని తెలిపారు. వాళ్ళ తో ప్రయాణం తప్పకుండా మన మహిళా సంఘాలకు లాభం చేకూరుతుందన్నారు. దీనిద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరగడంతోపాటు వ్యాపార వృద్ధి జరిగి, […]
READ MOREఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి వీఎల్-ఎస్ఆర్ సామ్ను భారత్ శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా చాందీపూర్ తీరంలోని ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్ఎస్) నుంచి వెర్టికల్ (నిట్టనిలువు) పద్ధతిలో దీన్ని ప్రయోగించారు. ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత నేవీ సంయుక్తంగా నిర్వహించాయి. వీఎల్-ఎస్ఆర్ అనేది షిప్ బార్న్ వెపన్ సిస్టం. ఇది సీ స్కిమ్మింగ్ లక్ష్యాలతో సమీప పరిధిలోని వైమానిక ముప్పులను న్యూట్రలైజ్ చేస్తుంది. ఈ రోజు […]
READ MOREఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు.ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలువురు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ద్రౌపది ముర్ము ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన మహిళా నేత. ఆమె జార్ఖండ్ గవర్నర్గా చేశారు. 2007లో బెస్ట్ ఎమ్మెల్యేగా ఒడిషా అసెంబ్లీ నుంచి నీలకంఠ్ అవార్డు […]
READ MOREరైతుబంధు కింద అన్నదాత లకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆరా తీసిన సీఎం.. వానాకాలం సాగు ప్రారంభమైన నేపథ్యంలో నిధులు సర్దుబాటు చేసి రైతులకు పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, […]
READ MOREకైతలాపూర్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఫ్లైఓవర్లను నిర్మించింది. కూకట్పల్లి నియోజకవర్గంలో కైతలాపూర్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. కైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రూ.86 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ ఫ్లైఓవర్తో కూకట్పల్లి, హైటెక్ సిటీల మధ్య సాపీ ప్రయాణం సాధ్యం కానుంది. జేఎన్టీయూ జంక్షన్, మలేషియన్ టౌన్ షిప్ జంక్షన్, హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు […]
READ MOREఉద్యోగుల, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. సోమవారం రోజు తన కార్యాలయంలో పరస్పర బదిలీలకు సంబంధించి సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలోని 2,558 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రయోజనం లభించనుంది. విద్యా శాఖ మంత్రి ఆదేశాలతో ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఒకటి, రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ కానున్నాయి.
READ MORE










