
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ లో 63.32 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా… సెకండ్ ఇయర్ లో 67.16 శాతం మంది పాస్ అయ్యారు. గతేడాది 70 శాతం సిలబస్తోనే పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ఫలితాల కోసం tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. కేవలం 54.25 శాతం మంది అబ్బాయిలు మాత్రమే పాస్ అయ్యారు. సెకండియర్ లో 59.21 శాతం మంది అబ్బాయిలు పాస్ కాగా… రెండు సంవత్సరాల ఫలితాల్లో 75.28 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




