
సమాజంలో అట్టడుగువర్గాల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని, దళితుల జీవితాల్లో పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలని.. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన సీఎం కేసీఆర్.ప్రతి దళిత ఉద్యోగితో పాటు రిటైర్డు ఉద్యోగులకు సైతం దళిత బంధు పథకం వర్తింపజేస్తామన్నారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్టు సర్వే చెబుతోందని, ఒకవేళ కొత్తగా పెళ్లిళ్లు జరిగుంటే మరికొన్ని కుటుంబాలు అదనంగా ఉండొచ్చేమోనని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 17లక్షలకు పైగా ఎస్సి కుటుంబాలు ఉండగా, వారందరికి పథకాన్ని అమలు చేస్తామన్నారు.తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు కరీంనగర్తో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని, ఆత్మీయతను నెమరువేసుకున్నారు. 2018 మే 10వ తేదీన ఇదే వేదికగా తాను రైతుబంధు పథకాన్ని ప్రారంభించానని గుర్తుచేశారు.ప్రభుత్వం ఇచ్చే రూ.పది లక్షల సహాయంతో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని, వివిధ వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్సుల్లో ప్రత్యేక కోటా కల్పిస్తామని ప్రకటించారు. ఈ స్కీం పర్యవేక్షణకు ముఖ్యమంత్రి కార్యాలయంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను నియమిస్తున్నట్టు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోందన్నారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ దళిత బంధుపై చర్చ జరుగుతోందన్నారు.24 గంటల ఉచిత కరెంట్ను అన్నప్పుడు ఇది అసాధ్యం అన్నవాళ్లే అంతా. అప్పుడున్న తెలంగాణ పరిస్థితి కూడా అలాంటిదే. కాని దాన్ని సుసాధ్యం చేస్తూ గత ఏడేళ్లుగా కరెంటు అందింస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినప్పుడు తమను కొందరు ఎద్దేవా చేశారని, కానీ.. నేడు రాష్ట్రంలో ధాన్యంరాశులు పొంగిపొర్లుతున్నాయన్నారు. 25 ఏళ్ల కిందటే సిద్ధిపేట దళిత చైతన్య జ్యోతి అని దళిత బంధుకు అప్పుడే బీజం వేశాం. నేను అప్పుడు సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నాను. రసమయి బాలకిషన్ తో కలిసి అనేక పాటలు తీసుకువచ్చాం.స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏండ్లలో ఏ ఒక్క పార్టీ ఈ కార్యక్రమాన్ని అమలుచేసినా నేడు ఈ పథకాన్ని చేపట్టాల్సిన అవసరముండేది కాదు. దళితబంధు ఒక్క హుజూరాబాద్తో ఆగిపోదు. ఈ పథకానికి హుజూరాబాద్ నియోజకవర్గం ఒక ప్రయోగశాల.




