
ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ, ఐకోమోస్ ఇండియా ICOMOS, India (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ వింగ్ ఆఫ్ ఇండియా) మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) సహకారంతో “హెరిటేజ్ పరిరక్షణ మరియు పర్యాటకం” పై అవగాహన సదస్సు ను టూరిజం ప్లాజాలో నిర్వహించారు. . ముఖ్య అతిథిగా యువజన సర్వీసులు, స్పోర్ట్స్, టూరిజం, సంస్కృతి అండ్ పురావస్తుశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి చే దీప ప్రజ్వలన తో కార్యక్రమ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెరిటేజ్ వాక్ నిర్వహించే ప్రధాన లక్ష్యం వారసత్వం మరియు సంస్కృతి గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడం మరియు వారసత్వాన్ని పరిరక్షించడంలో అందరు బాధ్యతగా ఉండాలని తెలిపారు. తెలంగాణాలోని అన్ని ప్రదేశాలలోను వారసత్వ సంపద పుష్కలంగా ఉంది. రామప్పకు వారసత్వ హోదా లభించడం తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు.
ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఛైర్మన్, టి.ఎస్.టి.డి.సి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి సి.ఎం.కేసీఆర్ గారు మరియు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారి సంయుక్త కృషితో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా వచ్చిందని గుర్తుచేశారు. భూదాన్ పోచంపల్లి గ్రామం ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రదేశంగా ప్రపంచ వారసత్వ హోదాను పొందిందని ఆయన అన్నారు. ఐకోమోస్ ఇండియా మరియు టిఎస్ టిడిసి సహకారంతో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ఈ రోజు ఉదయం చార్మినార్ నుండి చౌమహల్లా వరకు హెరిటేజ్ వాక్ ను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన అన్ని శాఖలకు వేదకుమార్ మణికొండ కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాలు సాధించలేని 800 సంవత్సరాల నాటి ‘మహిమాన్విత కాకతీయ దేవాలయం రామప్ప’ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చి, ప్రపంచ పటంలో తెలంగాణ వైభవాన్ని తిరిగి తీసుకురావడం లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి కృషిని ఆయన అభినందించారు. తెలంగాణ లోని అనేక వారసత్వ ప్రదేశాల పునరుద్దరణ , సంరక్షించడం కోసం నిరంతర కృషి జరుపుతున్న హెరిటేజ్ తెలంగాణ శాఖ, టి.ఎస్.టి.డి.సి శాఖ, అరవింద్ కుమార్ , MA&UD ని కూడా అభినందించారు.

డాక్టర్ మహమ్మద్ సఫియుల్లా, ఎండి, డెక్కన్ హెరిటేజ్ ట్రస్ట్, హైదరాబాదీ వంటకాలను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ఆహార ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వేయి స్తంభాల గుడి మరియు కుతుబ్ షాహీ సమాధులు మరియు హైదరాబాద్ లోని మరెన్నోంటికి వారసత్వ హోదాను తీసుకురావడానికి టిఎస్ టిడిసి తమ ప్రయత్నాలను కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సౌత్ జోన్ కన్వీనర్ ICOMOS సూర్యనారాయణ్ మూర్తి వారసత్వ ప్రదేశాల పునరుద్దరణ , సంరక్షించడం కోసం ICOMOS యొక్క పాత్ర మరియు ఆర్కిటెక్చరల్, అర్బన్, బిల్ట్ హెరిటేజ్ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతపై ప్రసంగించారు.
B.నారాయణ, డిప్యూటీ డైరెక్టర్, డిపార్ట్ మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ యొక్క వారసత్వము, నాణేలు, పురావస్తు శాస్త్రము, త్రవ్వకములు, శాసనాలు వంటి వాటిపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్.డి.టి.ఎస్.టి.డి.సి, బి.మనోహర్ రావు, మధు, నారాయణ, సత్యనారాయణ మరియు చరిత్రకారులు, ఆర్చిటెక్ట్స్, ఇంజనీర్స్, శ్రీ వెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్, CSIT, జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ , మొఇనాబాద్,వైశ్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ, అరోరా ఆర్కిటెక్చర్ కాలేజ్ తదితర కళాశాలల మరియు Oxford హై స్కూల్, హిమాయత్ నగర్ నుండి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ అవగాహన సదస్సు పాల్గొన్నారు.




