కేరళకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమ కైటెక్స్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. వరంగల్లోని కాకతీయ టెక్స్టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా చందన్వెల్లి సీతారామ్పూర్లో ప్లాంటు ఏర్పాటుకు కైటెక్స్ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.కైటెక్స్ గ్రూప్ ఎండీ సాబూ ఎం […]
READ MOREపాతబస్తీ నుంచి హుస్సేన్సాగర్ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్గంజ్ వరకే పరిమితం చేస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే పరిమితమవుతాయి. ప్రత్యేక బస్సులన్నింటికీ ‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు తిరుగుతాయి. గణేశ్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ […]
READ MOREతెలంగాణ హైకోర్టుకు సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టుకు ప్రశాంత్ కుమార్ మిశ్రా
admin September 17, 2021 0 COMMENTSతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీశ్ చంద్రశర్మ పేరును సుప్రీం కోర్టు కోలీజియం సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కర్ణాటక యాక్టింగ్ సీజేగా పని చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకమయ్యారు. ఏపీ హైకోర్టు సీజేగా వ్యవహరించిన ఏకే గోస్వామి ఛత్తీస్ గఢ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పని చేసిన జస్టిస్ హిమాకోహ్లి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. ప్రస్తుతం తాత్కాలిక సీజేగా రామచంద్రరావు కొనసాగుతున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన […]
READ MOREటీమిండియా సారథి విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ జట్టు నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు వెల్లడించాడు. పని భారాన్ని తగ్గించుకోవడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోహ్లీ తెలిపాడు. రవిశాస్త్రి, రోహిత్ శర్మతో పాటు జట్టు సభ్యులతో చర్చించిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పాడు. దుబాయ్లో జరిగే ఈ ప్రపంచ కప్ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా అని తన ట్విటర్లో […]
READ MOREతెలంగాణ భవన్లో విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కే కేశవరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమేనని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం రాలేదని… ఈరోజే (సెప్టెంబర్ 17) మనకు సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవమని చెప్పారు.సెప్టెంబర్ 17పై కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని కేశవరావు విమర్శించారు.
READ MOREహైదరాబాద్ నగరం గణేశ్ నవరాత్రి ఉత్సవాల శోభను సంతరించుకున్నది. ఖైరతాబాద్లో పంచముఖ రుద్ర గణపతి కొలువయ్యాడు. స్వామివారికి 60 అడుగుల గరికమాల, జంద్యం, కండువా సమర్పించార పద్మశాలీలు. ఖైరతాబాద్ గణనాథుడికి తొలిపూజ జరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై…హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పూజలో పాల్గొన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో రూపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు ఇక్కడ. ఎత్తులోనూ అంతే ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తు పెంచుకుంటూ పోతారు. అందుకే, ఒక్క భాగ్యనగర వాసులే కాదు.. రాష్ట్రం నలుమూలల […]
READ MOREహైదరాబాద్ నుంచి లండన్కు మొదటిసారి నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా నుంచి నేరుగా లండన్ నాన్స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఎయిర్ ఇండియా ఈ జాబితాలోకి హైదరాబాద్ను కూడా చేర్చింది. హైదరాబాద్ నుంచి లండన్కు ప్రతి సోమ, శుక్రవారాల్లో విమానం నడుస్తుందని పేర్కొంది. సోమవారం ఏఐ 147 విమానం హైదరాబాద్లో (భారత కాలమానం) రాత్రి 1.30 […]
READ MOREరాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో పట్టణాలు, ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ వర్షాలు, వరదలపై అక్కడి నుంచే సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎస్ను ముఖ్యమంత్రి ఆదేశించారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు, నాళాలు తదితర […]
READ MOREరాజన్న సిరిసిల్ల జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్
admin September 7, 2021 0 COMMENTSసిరిసిల్ల పట్టణంలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది.లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో వరద నీరు ఇళ్లలోకి చేరింది. పాతబస్టాండ్ మొదలుకుని శాంతినగర్ వరకు దాదాపు పట్టణమంతా జల దిగ్బంధంలో చిక్కుకుంది. కొత్త చెరువు పూర్తిగా నిండి సిరిసిల్ల ప్రధాన రహదారిపై నుంచి పొంగి ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి వరద ఉదృతి పెరగడంతో కాలనీలకు భారీగా వరద […]
READ MOREతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టిఎస్ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా విసి సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు.సజ్జనార్ను కొద్దిరోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. మూడేళ్ల పాటు సైబరాబాద్ సీపీగా పని చేసి.. నేరాల కట్టడికి కఠిన చర్యలు తీసుకున్నారు.వారం రోజుల క్రితం సజ్జనార్ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సజ్జనార్ గతం లో సీఐడీ, ఇంటిలిజెన్స్ విభాగాలలో పనిచేశారు.సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ […]
READ MORE









