ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంతకం చేశారు. ఇప్పటి వరకు హరీశ్ రావు ఆర్థిక శాఖను మాత్రమే పర్యవేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖలను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. ప్రస్తుతం ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉంది.అప్పట్లో వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి […]
READ MOREఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలై.. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్న చిత్రం‘ జైభీమ్’. సూర్య కథానాయికుడిగా, జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ మేసేజ్ ఓరియెంటెడ్ మూవీ….28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా హిట్ టాక్ సంపాదించుకుంది. కొండ ప్రాంతానికి చెందిన ఈ దంపతుల యదార్థ ఘటనల ఆధారంగా చేసుకుని నిర్మించిన చిత్రం జై భీమ్. ఇటీవల ఈ సినిమా చూసిన తమిళ నటదర్శకుడు […]
READ MOREతెలంగాణలో నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడేండ్లలో లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 60 నుంచి 70వేల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.సోమవారం ప్రగతిభవన్లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. యువతకు మేలుచేకూర్చే నిర్ణయాలు ఎన్నో తీసుకొన్నామని, కొత్త జోనల్ వ్యవస్థే అందుకు నిదర్శమని తెలిపారు. దేశంలోనే నిరుద్యోగం తక్కువ ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని, అయినా బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. […]
READ MOREహుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ విధించారు. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగుతున్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లో 1,695 ఓట్ల మెజారిటీ పొందారు. మొత్తంగా ఈటలకు 2,958 […]
READ MOREతెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్కు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలు ముందుకొస్తే వారికోసం ప్రత్యేకంగా పారిశ్రామిక సముదాయాన్ని (క్లస్టర్) అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న కేటీఆర్, శుక్రవారం ప్యారిస్లోని ఆ దేశ సెనేట్లో ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరంలో కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలను వివరించారు. ‘గ్రోత్: డ్రాఫ్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ […]
READ MOREకొవిడ్-19 టీకా కార్యక్రమంలో వీఐపీ కల్చర్ ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అక్టోబర్ 21(గురువారం) వరకు భారత్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇది ప్రతీ భారతీయుడి విజయం అని.. దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం 100 కోట్ల కరోనా టీకా […]
READ MOREమహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయంలో స్వామి వారి దర్శనం భక్తులకు లభిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి వారం రోజుల ముందు అంటే మార్చి 21న 108 కుండాలతో మహా సుదర్శన యాగానికి అంకురార్పణ జరుగుతుంది. ఆ తర్వాతే ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దర్శనాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.మహా ఉత్క్రుష్ట చరిత్ర గల స్వయంభువు శ్రీయాదగిరి […]
READ MOREటీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్ నామినేషన్ దాఖలైంది. ఆయన పేరును ప్రతిపాదిస్తూ మంత్రులు, పార్టీ నేతలు ఆరు సెట్ల నామినేషన్ పత్రాలను ఆదివారం దాఖలు చేశారు.ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ మరుసటి రోజు నామినేషన్ పత్రాల పరిశీలన, ఈ నెల 24న నామినేషన్ల ఉపసంహరణ, ఈ నెల 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్ రెడ్డి, […]
READ MOREసద్దుల బతుకమ్మ పండుగ ఈరోజే. ఇవాళ్టితో బతుకమ్మ సంబరాలు ముగియనున్నాయి. సంప్రదాయం ప్రకారం దుర్గాష్టమి రోజునే సద్దుల బతుకమ్మ జరుపుకోనున్నారు. బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఫలాహారాలు చేస్తారు. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను ఫలహారాల రూపంలో బతుకమ్మ అందిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 13 వ తేదీన సద్దుల బతుకమ్మగా ఖరారు చేసింది. […]
READ MOREగ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరు ఊరుకో జమ్మి చెట్టు-గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కలిసి జమ్మి మొక్కను నాటారు. జోగినపల్లి సంతోష్ కుమార్ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న కీసర అభయారణ్యంలోని పెద్దమ్మ చెరువు పర్యాటక అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే వివేకానంద, జడ్పి చైర్మన్ శరత్ […]
READ MORE










