
తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.పత్తిపాక మోహన్కు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహితీ పురస్కారం లభించింది.
సిరిసిల్ల నేలపై మెరిసిన సాహిత్య రత్నం మోహన్ : సీఎం కేసీఆర్
2022 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురస్కారం’కు డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. మోహన్ రాసిన ‘బాలల తాత బాపూజీ’ పాటకు ఘన విజయం దక్కడం గొప్ప తరుణమని కేసీఆర్ అన్నారు. మహాత్మాగాంధీపై బాలసాహిత్యానికి గాను తెలంగాణ సాహితీవేత్త అవార్డు సాధించడం భారతదేశ వజ్రోత్సవాల సందర్భంగా మరింత కీర్తిని తెచ్చిపెట్టిందని కేసీఆర్ అన్నారు.సిరిసిల్లకు చెందిన చేనేత సామాజికవర్గం నుంచి వచ్చిన ప్రముఖ రచయిత సినారే శిష్యుడుమోహన్ సాహిత్యరంగంలో ఎన్నో శిఖరాలను అధిరోహించి తెలంగాణ సాహిత్యానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. పిల్లల కోసం మన కవులు, జో అచ్యుతానంద జోజో ముకుందా…, చందమామ రావే, ఒక్కేసి పువ్వేసి చందమామ పిల్లల కోసం ఎన్నో రచనలు ఉన్నాయి. నేషనల్ బుక్ ట్రస్ట్ యొక్క తెలుగు సంపాదకులుగా వివిధ భాషల్లోని కథలను తెలుగులోకి అనువదించారు.
ఎన్నో దశాబ్దాల కృషి: వేదకుమార్ మణికొండ,బాలచెలిమి సంపాదకులు
ఈ పురస్కారం వెనుక ఎన్నో దశాబ్దాల కృషి , నిరంతర అధ్యన శీలి పత్తిపాక మోహన్ . బాలల ప్రపంచానికి ఇంకా ఎన్నో వజ్రాలను పత్తిపాక అందిస్తాడన్న నమ్మకము నాకుంది. ఇలాంటి ఆశయాలతో ముందుకు వెళ్తూ.. మరెన్నో కీర్తి ప్రతిష్టాలు మీ విజయానికి బాటాలుగా నిలుస్తాయని ఆశిస్తున్నాను.




