
ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా డెక్కన్ హెరిటేజ్ అకాడమీ DHA, ఐకోమోస్ ఇండియా ICOMOS, India (ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ వింగ్ ఆఫ్ ఇండియా) మరియు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC) సహకారంతో మరియు ముఖ్య అతిధిగా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, మున్సిపల్&అడ్మినిస్ట్రేషన్(MA&UD) అరవింద్ కుమార్ చార్మినార్ దగ్గర జెండా ఊపి హెరిటేజ్ వాక్ ను ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుండి 8.30 వరకు హెరిటేజ్ వాక్ ను నిర్వహించారు. అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. చుడీ బజార్ పునరుద్ధరణ ప్రక్రియలో అబల్ అంబా గ్రూపు డిజైన్ చేస్తోందని చెప్పారు. సర్దార్ మహల్ చరిత్ర కు సంబంధించిన కథలను శిల్ప ఆకారంలో రూపొందించడం ద్వారా ఆర్టిస్ట్ విలేజ్ గా తీర్చిదిద్దే ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రతి వారం హెరిటేజ్ వాక్ లు నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, జిహెచ్ ఎంసి అన్నపూర్ణ క్యాంటీన్ ద్వారా పాల్గొనేవారికి స్నాక్స్ మరియు లంచ్ అందిస్తామని ఆయన చెప్పారు.
వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ యునెస్కో1983 లో ఏప్రిల్ 18 ను ప్రపంచ వారసత్వ దినోత్సవంని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్ర భుత్వం మరియు అరవింద్ కుమార్ గారు వారసత్వ పరిరక్షణలో చేస్తున్న ప్ర యత్నాలను ఆయన అభినందించారు. అరవింద్ కుమార్ గారి పర్యవేక్షణ లో శిథిలావస్థలో ఉన్న 30 మెట్ల బావులు, గేట్ వేస్, క్లాక్ టవర్స్, టూంబ్స్, మెహబూబ్ చౌక్, క్లాక్ టవర్స్, మిర్యాలం మండి మొదలైన వాటిని పునరుద్ధరించడం పట్ల ఆయన హర్షం వ్యక్త పరిచారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వం, నిర్మిత, జాతీయ వారసత్వాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్ర భుత్వం అనేక చ ర్య లు చేప ట్టిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జాతరలు, బతుకమ్మ, మొహర్రం, రంజాన్, దస్సేరా మొదలైన జాతరలను ప్రభుత్వం సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడం ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించి మన వారసత్వ సంపద గొప్పదనాన్ని దేశం నలుమూలలా వ్యాపింప చేస్తూంది అని కొనియాడారు .

టూరిస్ట్ గైడ్ శ్రీ. రాయిజ్ కుబ్రా మరియు కన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ మధు వోటరీ లు భారతదేశం యొక్క వారసత్వం యొక్క చారిత్రక ప్రాముఖ్యత, హైదరాబాద్ యొక్క చారిత్రక ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో డా.స్మిత ఎస్ కుమార్, సుపరింటెండింగ్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా,హైదరాబాద్ సర్కిల్, శ్రీ. బి.మనోహర్ రావు, ఎండి, టిఎస్టిడిసి, ఆర్కిటెక్ట్ శ్రీ. సూర్యనారాయణ మూర్తి, కన్వీనర్, ఐకోమోస్ ఇండియా, సౌత్ జోన్ ఆహ్వాన అతిధులు మరియు రిత్రకారులు, ఆర్చిటెక్ట్స్, ఇంజనీర్స్, శ్రీ వెంకటేశ్వరా కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్, CSIT, జెబిఆర్ ఆర్కిటెక్చర్ కాలేజ్ , మొయినాబాద్, వైశ్ణవి ఆర్కిటెక్చర్ కాలేజ, అరోరా ఆర్కిటెక్చర్ కాలేజ్ తదితర కళాశాలల మరియు Oxford హై స్కూల్, హిమాయత్ నగర్,గీతాంజలి పబ్లిక్ స్కూల్ నుండి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




