
జీహెచ్ఎంసీ మొదటి స్థాయీ సంఘం సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనుంది. 20 అంశాలతో ఎజెండాను రూపొందించారు. ఇటీవలే కొత్త స్టాండింగ్ కమిటీ సభ్యులుగా 15మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. రెండు కీలక ప్రాజెక్టులకు గ్రేటర్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపనుంది. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా తొలి మహిళా టూరిస్టుల వసతి గృహాన్ని నెలకొల్పనున్నారు. నాంపల్లి సరాయి పక్కన రూ.11 కోట్ల రూపాయలతో 187 మందికి వసతి కల్పించేలా భవనం నిర్మించనున్నారు. జవహర్నగర్ డంపింగ్ యా ర్డు పక్కన మల్కారం చెరువును రూ. 251కోట్లతో శుద్ధి చేసే ప్రాజెక్టు, నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని సఫారి పార్కు నుంచి కిషన్బాగ్ రోడ్డు వరకు ప్రహరీ నిర్మా ణం, పలు చెరువుల వద్ద వరద నీటి కాలువలు, ఒప్పం ద ఇంజినీర్ల పదవీకాలం పొడగింపు , కాటేదాన్ క్రీడా ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.




