పాకిస్థాన్ విద్యా సంస్థల్లో డిగ్రీ చదివితే, భారత దేశంలో ఉద్యోగాలకు అనర్హులు : యూజీసీ, ఏఐసీటీఈ
admin April 23, 2022 0 COMMENTS
ఉన్నత విద్య కోసం పాకిస్తాన్కి వెళితే ఇండియాలో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు స్పష్టం చేశాయి.ఉన్నత విద్య కోసం పాకిస్థాన్ వెళ్ళొద్దని సూచించాయి. మన దేశంలో ఉన్న, విదేశాల్లో ఉంటున్న విద్యార్థులు పాకిస్థాన్ వెళ్ళొద్దని తెలిపాయి. పాకిస్తాన్లోని విద్యా సంస్థల నుండి డిగ్రీ పొందిన భారతీయ పౌరులు లేదా భారతదేశంలోని విదేశీ పౌరులు ..భారత దేశంలో ఉద్యోగం లేదా ఉన్నత విద్యను పొందేందుకు అర్హులు కాదని పేర్కొంది. ..పాకిస్థాన్లో డిగ్రీ పొంది, భారత దేశానికి వలస వచ్చినవారు, వారి పిల్లలకు ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయింపు ఉన్నట్లు తెలిపింది. భారతదేశం పౌరసత్వం పొందిన వారి పిల్లలు హోం మంత్రిత్వ శాఖ నుండి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందిన తర్వాత భారతదేశంలో ఉపాధిని పొందేందుకు అర్హులు అని నోటీసు పేర్కొంది.




