రాష్ట్రావతరణ శతాబ్ది వేడుకలు.. గంటన్నరపాటు సాగిన సీఎం కేసీఆర్ ప్రసంగం
admin June 2, 2023 0 COMMENTS
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకలు శుక్రవారం కన్నుల పండువగా కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు ఆయన సందర్భంగా ఘనంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైందన్నారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించే అదృష్టం తనకు దక్కిందని సంతోషంగా ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.తెలంగాణ మోడల్గా కీర్తి ప్రతిష్టలందుకుంటున్న జన పాలన గురించి సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో కూలంకషంగా వివరించారు. గంటన్నరపాటు సాగిన ప్రసంగంలో ఒక్కో రంగంలో సాధించిన అభివృద్ధిని మానవీయ కోణంలో సాగించిన పాలనాదార్శనికతను విశ్లేషించారు. కరోనా కాలంలో కొంత కష్టపడ్డామని, ఇది నవీన తెలంగాణ నవనవోన్మేష తెలంగాణ అని అన్నారు. తలసరి ఆదాయం దేశంలోని పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరసలో ఉందని కొనియాడారు. సర్వజన హితాన్ని కాంక్షిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళ సహా పేద వర్గాలకు సర్వజన సుఖం కోసం తమ పాలన కొనసాగుతూనే వుంటుందని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందన్నారు. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నదని, దీనికి రైతుబంధు పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వృత్తి పనులవారికి ఆర్ధిక ప్రేరణనివ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరిందన్నారు. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగాయని, మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులందుకుంటున్నాయని, పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతున్నాయన్నారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడం కోసం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎంతో వ్యయంతో, అన్ని వసతులతో అందంగా నిర్మించిన ఈ ఇండ్లను పేదలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.




