
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరేది గులాబీ జెండానే అని చెప్పారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ భారత రాష్ట్ర సమితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.శంలో మహిళా సాధికారత కోసం కొత్త విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. అదే విధంగా కొత్త పర్యావరణ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.రాబోయేది రైతు ప్రభుత్వమే అని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామన్నారు. రైతుపాలసీ, జల విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో కర్ణాటక జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి, ప్రముఖ సినీ నటుడు సామాజిక రాజకీయ వేత్త ప్రకాష్రాజ్, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు.




