ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జెన్సీ కోసం DRF టీమ్స్ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈనెల 8 నుంచి గ్రేటర్లో వర్షం పడుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి జల్లులు పడినప్పటికీ.. సాయంత్రం 5 గంటల తర్వాత మోస్తరు వర్షం పడింది. వర్షాల నేపథ్యంలో చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో వివిధ మార్గాల్లో నడిచిన […]
READ MOREఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 53.90అడుగులకు పెరిగింది. అధికారులు సోమవారం సాయంత్రానికే మూడవ ప్ర మాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరితోపా టు దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య […]
READ MOREశంషాబాద్లో శాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్
admin July 7, 2022 0 COMMENTSవిమానాల మెయింటెనెన్స్, రిపేరీ రంగంలో అగ్రగామిగా ఎదిగిన సఫ్రాన్ కంపెనీ యూనిట్ను గురువారం హైదరాబాద్లో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 1200 కోట్ల పెట్టుబడితో ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసింది. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద ఎమ్మార్వో కేంద్రం ఇదేనని, మన దేశంలో ఓ విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి ఇంజిన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనని తెలిపారు. ఎంఆర్ఐ ఫెసిలిటీ సెంటర్ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. […]
READ MOREఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. గురువారం కాకతీయ వైభవ సప్తాహం ఉత్సావాలను ప్రారంభించేందుకు కమల్ చంద్ వరంగల్కు వచ్చారు. ఈ నేపథ్యంలో భంజ్దేవ్ ఇవాళ ఉదయం వరంగల్కు చేరుకుని భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. ఇక్కడ […]
READ MOREరాష్ట్ర ప్రభుత్వం ఎంతో మందికి విద్యను అందిస్తున్న గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సిఎం అన్నారు. పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే తక్షణ చర్యలు […]
READ MOREబల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతోంది. కల్యాణ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు.
READ MOREఅల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాలు, త్యాగాలను జాతికి వివరించడానికి ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్మించిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. అల్లూరి జన్మించిన పుణ్యభూమికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని అందుకు ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. వందేమాతరం నినాదం, ‘మనదే రాజ్యం’ నినాదం ఒకే లాంటివని చెప్పారు. అల్లూరి […]
READ MOREవిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. సిన్హాకు కేసీఆర్, తెలంగాణ కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ఈ ప్రచారంలో పాల్గొంటుండడం విశేషం. భారీ ర్యాలీగా.. జలవిహార్ వద్ద టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా ఉంది.
READ MOREపదో తరగతి ఫలితాలు ..విద్యార్థుల ఉత్తీర్ణతలో సిద్దిపేట జిల్లా మొదటి స్థానం
admin June 30, 2022 0 COMMENTSతెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 90 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో బాలికలదే పైచేయి. సిద్దిపేట జిల్లా 97 శాతంతో మొదటి స్థానంలో, హైదరాబాద్ 79 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. మార్కులు తక్కువ వచ్చిన వారు నేటి నుంచి 15 రోజుల్లోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఆగస్టు 1వ తేదీ […]
READ MOREతెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ చేస్తున్న వైనం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఇవాళ ఇంటర్ […]
READ MORE










