తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇంటర్ ఫస్టియర్లో 49 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణులయ్యారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫలితాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి https://tsbie.cgg.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.మార్కుల మెమోలను 17వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి […]
READ MOREకేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పెద్ద సంస్కరణకు మార్గం సుగమం చేసింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించింది. దీని వల్ల బోగస్ ఓట్లకు అవకాశం ఉండదు. ఒక వ్యక్తి ఒకటికి మించి ఓట్లను కలిగి ఉండటానికి చెక్ పడుతుంది. దొంగ ఓట్లు వేయడం సాధ్యం కాదు.కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసుల మేరకు ఈ సంస్కరణకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఓటర్ల జాబితాను […]
READ MOREఅమ్మాయిల వివాహ వయసు పెంపునకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగంగానే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరని పేర్కొన్న సంగతి తెలిసిందే.పురుషుల వయసు 21 సంవత్సరాలు ఉండడంతో అమ్మాయిల […]
READ MOREతెలంగాణలో బుధవారం రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ”ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్ ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98 శాతం పూర్తి అయిందని తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు.అలాగే […]
READ MOREయాదాద్రి కలెక్టరేట్లో ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్ను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ బుధవారం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో 22 కొత్త ఈవీఎం, వీవీప్యాట్ గోడౌన్స్ మంజూరయ్యాయని, అందులో 20 పూర్తి కాగా రెండు తుది దశలో ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. గరుడ యాప్ ద్వారా బూత్ లెవల్ పని చేసేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు.రాష్ట్రంలో ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, జనవరి 1 వరకు 18 […]
READ MOREతెలంగాణలో ఇద్దరు ఒమిక్రాన్ కేసుల బాధితులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు.ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారించబడ్డారు అని తెలిపారు.ఇద్దరిని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కెన్యా జాతీయురాలి వయసు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 […]
READ MOREస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఆర్ఎస్
admin December 14, 2021 0 COMMENTSస్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు స్థానాలనూ గెలుచుకుని క్లీన్స్వీప్ చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఏ ఎన్నికలైనా తిరుగులేదనిపించింది. మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. విపక్షాలు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 6 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఆరు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు.ఈ […]
READ MOREబాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “THE GREEN PUZZLE” పుస్తకాన్ని ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ చైర్మన్ శ్రీ మణికొండ వేదకుమార్ విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్(ఢిల్లీ ), చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు రచించారు. సహజ వనరుల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను తీసుకురావడంలో ఫోరమ్ ఫర్ ఏ బెటర్ హైదరాబాద్ ఎన్నో సమావేశాలను నిర్వహించింది. మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ.. చెట్లు నరకడం వలన అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ఈ ప్రకృతిలో మమేకమైన చెట్లు. నదులు, వాగులు, వంకలు. మరియు నీటి కాలువలను కాపాడటమే మన లక్ష్యంగా పెట్టుకోవాలని తెలియజెప్పారు. పర్యావరణ రక్షణకై కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ ‘ ది గ్రీన్ […]
READ MORE“హర హర మహదేవ్” కాశీ విశ్వనాథ్ కారిడార్ను ప్రారంభించిన: ప్రధాని మోదీ
admin December 13, 2021 0 COMMENTSమోడీ కాన్వాయ్ పై పూల వర్షం కురిపించారు. దీంతో ప్రధాని వెళ్లే దారంతా గులాబీ పూలతో నిండిపోయింది. అయితే మోడీ కాన్వాయ్ వస్తుండగా ఓ వ్యక్తి ఆయనకు బహుమతి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. కాషాయి వస్త్రాల్లో వచ్చిన వ్యక్తి తెచ్చిన కానుకను మోదీ కారు డోర్ ఓపెన్ చేసి స్వీకరించారు. అది గమనించిన ప్రధాని మోదీ.. భద్రతా సిబ్బందికి సర్దిచెప్పి.. ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచారు. అతని నుంచి తలపాగా, శాలువా స్వీకరించి ధన్యవాదాలు తెలిపారు. అక్కడ […]
READ MOREఢిల్లీలో రెండో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఈ వ్యక్తి దక్షిణాఫ్రికాకు కూడా వెళ్లొచ్చారు. ఒమైక్రాన్ రోగిని దేశ రాజధానిలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్లో చేర్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో ఒమైక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.ముంబై నగరంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య శనివారం నాటికి 17కు పెరగడంతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో ముంబైలో మూడు కేసులు ఉండగా, పింప్రి […]
READ MORE









