
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత తిరిగి బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో తన పేరిట ఉన్న రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు. ఫిన్ లాండ్ లో జరుగుతున్న పావో నుర్మి గేమ్స్ లో 89.30 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి రికార్డు సృష్టించాడు. పావో నుర్మీ గేమ్స్లో రజతం గెలిచిన నీరజ్ చోప్రా.. ఆలివర్ హెలాండర్ (ఫిన్లాండ్) స్వర్ణం నెగ్గగా, అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) కాంస్యం దక్కించుకున్నాడు. గత ఏడాది మార్చిలో పాటియాలాలో జరిగిన పోటీల్లో 88.07 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి నీరజ్ చోప్రా జాతీయ రికార్డును క్రియేట్ చేశాడు. గత ఏడాది ఆగస్టులో టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ ను 87.58 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే.
RELATED ARTICLES
LEAVE A COMMENT




