
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల భారత పర్యటన గురువారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించడంతో ప్రారంభమైంది. లండన్ నుంచి నేరుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సబర్మతీ ఆశ్రమంలో నూలు చరఖాను ఎలా తిప్పాలో ఆశ్రమంలోని మహిళలు ఆయనకు వివరించారు. విజిటర్స్ పుస్తకంలో , ఓ అసాధారణ వ్యక్తికి చెందిన ఆశ్రమాన్ని విజిట్ చేయడం గౌరవంగా భావిస్తానని, ప్రపంచాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు సత్యం, అహింసా సిద్ధాంతాలను గాంధీ ఎలా వాడరన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని బోరిస్ విజిటర్స్ బుక్లో రాశారు. సబర్మతీ ఆశ్రమానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఆశ్రమం విశేషాలను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ శిష్యురాలు మీరాబెన్ (మెడలీన్ స్లేడ్) రాసిన ‘ది స్పిరిట్స్ పిల్గ్రిమేజ్’ పుస్తకాన్ని జాన్సన్కు బహూకరించారు.గాంధీ రాసిన గైడ్ టు లండన్ అన్న పుస్తకాన్ని బోరిస్కు గిఫ్ట్గా ఇచ్చారు. బోరిస్ కరోనా కారణంగా గతేడాది రెండుసార్లు భారత్ పర్యటనను రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.





