
దళిత బంధు పైలట్ ప్రాజెక్టుపై సమీక్ష చేశామని సీఎస్ సోమేష్కుమార్ తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనుండడం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకానికి లబ్దిదారుల జాబితా రూపొందించారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు జరుగుతుందని, అనుమానాలు ఏమీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈనెల 16న సీఎం సభలో 15 మంది లబ్ధిదారులకు చెక్కులు అందిస్తారని పేర్కొన్నారు. ఇంకా ఎవరిని కూడా లబ్ధిదారులను ఎంపిక చేయలేదని అన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ దళిత బంధు అమలు చేస్తామన్నారు.దళిత బంధు అద్భుతమైన పథకం అని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు జరుగుతుందని వెల్లడించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




