
తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును ప్రభుత్వం నియమించింది. కె.కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పటేల్ను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసింది. బీఎస్ రాములు అధ్యక్షతన ఏర్పాటైన తొలి కమిషన్ పదవీ కాలం ముగియడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసింది.ఉద్యమకారులు, సామాజిక సమీకరణలు పాటిస్తూ ప్రభుత్వం బిసి కమిషన్ను నియమించింది. గత బిసి కమిషన్లో పనిచేసిన సీనియర్ సభ్యులు అయిన వకుళాభరణంకు ఈ సారి ఛైర్మన్ పదవి వరించింది.తనను బీసీ కమిషన్ చైర్మన్గా నియమించడంపై వకుళాభరణం సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమని, తనను గుర్తించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.హుజూరాబాద్ పట్టణానికి చెందిన వకుళాభరణం కృష్ణమోహన్రావు రచయిత. బీసీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పటికే మూడు సార్లు బీసీ కమిషన్ మెంబర్గా పని చేశారు.ఓయూ నుంచి ఎంఏ (తెలుగు) పూర్తి చేసి ‘దశాబ్ది కవిత్వం (1991-2000) పరిశీలన’ అనే అంశంపై పీహెచ్డీ చేశారువకుళాభవరణం బిసిలలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన దాసరి సామాజికవర్గానికి చెందినవారు.




