
- పాతబస్తీ నుంచి హుస్సేన్సాగర్ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్గంజ్ వరకే పరిమితం చేస్తారు.
- సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే పరిమితమవుతాయి.
- ప్రత్యేక బస్సులన్నింటికీ ‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు తిరుగుతాయి.
గణేశ్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన ఉత్సవాలకు ప్రభుత్వం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. రహదారుల మరమ్మతులు చేపట్టవలసిన ప్రాంతాలను గుర్తించి విగ్రహాలకు అడ్డంగా ఉండే విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని సూచించారు.క్రేన్ నంబర్ 5 వద్ద ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఉంటుంది. వీలైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నిమజ్జన ప్రక్రియలో పాల్గొనే వారందరికీ మాస్కులు పంపిణీ చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 లోపు మహాగణపతి నిమజ్జనం అవుతుందని ఉత్సవ కమిటీ పేర్కొంటోంది. HMDA, ట్రాన్స్ పోర్టు. వాటర్ బోర్డు, హెల్త్ డిపార్మెంట్ అధికారుల సహాకారంతో… వినాయక నిమజ్జనాలపై రూట్ మ్యాప్ తయారు చేశారు. శనివారం సాయంత్రం నుండి అనేక రూట్లలో ట్రాఫిక్ మళ్లించి.. వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి తలసాని.శోభాయాత్ర సాగే రూట్తో పాటు హుస్సేన్ సాగర్ చుట్టూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.




