
దళితబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఈ నిధులను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం ఇవాళ విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసిఆర్ ఆదేశాలతో పూర్తి నిధులు నిధులు విడుదల కావడంతో ఇక దళిత బంధు పథకాన్ని నిబంధనలను అనుసరిస్తూ సీఎం కేసీఆర్ ఆకాంక్షల మేరకు చక చకా అమలు చేయడమే మిగిలింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు, దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కోసం నిధుల విడుదల వివరాలు :
- 09.08.2021 నాడు రూ. 500 కోట్లు
- 23.08.2021 నాడు రూ. 500 కోట్లు
- 24.08.2021 నాడు రూ. 200 కోట్లు
- 25.08.2021 నాడు రూ. 300 కోట్లు
- 26.08.2021 (నేడు) రూ. 500 కోట్లు
మొత్తం రూ. 2000 కోట్లు విడుదల చేశారు.
RELATED ARTICLES
Bestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.




