
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసింది. శనివారం ఉదయం చెన్నై నగరంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బస్ లో అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో స్టాలిన్ మాట్లాడారు. తన ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ బస్సు కండక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ పథకం గురించి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. మెరీనా బీచ్ బస్సులో చేరుకున్న సీఎం స్టాలిన్.. అక్కడ ఉన్న మాజీ సీఎం కరుణానిధి స్మారకం వద్ద నివాళి అర్పించారు. రాష్ట్ర శాసనసభలో ఐదు కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ స్కూల్లలో ఒకటి నుంచి 5వ తరగతి పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రకటించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మెడికల్ చకప్, పట్టణ కేంద్రాల్లో పీహెచ్సీల ఏర్పాటుపై ప్రకటన చేవారు. అన్ని నియోజకవర్గాల్లో సీఎం అన్న స్కీమ్ను కూడా ప్రకటించారు.




