
అమ్మాయిల వివాహ వయసు పెంపునకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమ ప్రభుత్వం కుమార్తెలు, సోదరీమణుల ఆరోగ్యం గురించి నిరంతరం శ్రద్ధ వహిస్తుందని తెలిపారు. అదే విధంగా పోషకాహార లోపం నుంచి వారిని రక్షించాలని, అందులో భాగంగానే వారికి సరైన వయసులో వివాహం చేయటం అవసరని పేర్కొన్న సంగతి తెలిసిందే.పురుషుల వయసు 21 సంవత్సరాలు ఉండడంతో అమ్మాయిల వయసు కూడా పెంచాలనే డిమాండ్ వచ్చింది. అమ్మాయి వయసు పెంచడపై కేంద్రం ప్రభుత్వం నీతి ఆయోగ్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఆ టాస్క్ ఫోర్స్కు అరుణ్ జైట్లీ నేతృత్వం వహించారు. ఈ టాస్క్ ఫోర్స్లో ప్రభుత్వ నిపుణులు డాక్టర్ వికె పాల్, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, న్యాయ మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఉన్నారు. అమ్మాయి తొలిసారి గర్భం దాల్చే నాటికి ఆమెకు 21 ఏళ్లు ఉండాలని టాస్క్ ఫోర్స్ ప్రతిపాదించింది. 21 ఏళ్లకు పెళ్లి చేయడం వల్ల వారి కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా సానుకూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.




