అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మంది ప్రమాణస్వీకారం
admin August 31, 2021 0 COMMENTSసుప్రీం కోర్టులో మంగళవారం ఉదయం అపూర్వ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒక్కరోజే తొమ్మిది మంది సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణస్వీకారం చేశారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వీరితో ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సి.టి. రవికుమార్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ బేలా మాధుర్య త్రివేది, జస్టిస్ పమిడిగంథం శ్రీనరసింహలు ప్రమాణం చేశారు. ఒకేసారి తొమ్మిది […]
READ MOREరాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. సోమవారం సాయంత్రం వరదల్లో చిక్కుకున్న బస్సును జేసీబీ సహాయంతో తీయడానికి ప్రయత్నించారు. కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వాగులో చిక్కుకుపోయింది. ఒక టైర్ కిందికి దిగి ఆగిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉండగా.. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను […]
READ MOREదళితబంధును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికి నిధులు వేగంగా విడుదల చేస్తోంది. హుజూరాబాద్లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఈ నిధులను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం ఇవాళ విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది.పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే […]
READ MOREతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను బదిలీ చేసింది. సజ్జనార్ ను ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.దాదాపు 3 ఏళ్లకు పైగా సైబరాబాద్ కమిషనర్గా సేవలు అందించిన సజ్జనార్. .కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్లో విశేష సేవలు అందించారు. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ కమిషనర్గా 1999 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి ముత్యాల స్టీఫెన్ రవీంద్రను […]
READ MOREతెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్థన్, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://eamcet.tsche.ac.in వెబ్సైట్లో చూడవచ్చు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. గతంలో ఇంటర్లో 45 శాతం మార్కులు ఉంటేనే ఇంజనీరింగ్ సీటు పొందే అవకాశం ఉండేది. కానీ పరీక్షలు రద్దు కావడంతో ఇప్పుడు ఎంసెట్లో అర్హత సాధించిన వారందరూ కౌన్సెలింగ్కు అర్హులుగా అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ […]
READ MOREసెప్టెంబరు 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
admin August 24, 2021 0 COMMENTSరాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలనూ సెప్టెంబరు 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీంతో సుమారు ఏడాదిన్నరగా మూగబోయిన బడి గంటలు మళ్లీ మోగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.30వ తేది లోపు స్కూళ్లను పరిశుభ్రంగా తయారు చేస్తామని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ, […]
READ MOREతెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును ప్రభుత్వం నియమించింది. కె.కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పటేల్ను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసింది. బీఎస్ రాములు అధ్యక్షతన ఏర్పాటైన తొలి కమిషన్ పదవీ కాలం ముగియడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసింది.ఉద్యమకారులు, సామాజిక సమీకరణలు పాటిస్తూ ప్రభుత్వం బిసి కమిషన్ను నియమించింది. గత బిసి కమిషన్లో పనిచేసిన సీనియర్ సభ్యులు అయిన వకుళాభరణంకు ఈ సారి ఛైర్మన్ […]
READ MOREదళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలివిడతగా ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు మొత్తం రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.2వేల కోట్ల విడుదల చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ […]
READ MOREహైదరాబాద్ బంజారాహిల్స్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభోత్సవం నేడు జరిగింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ,ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్లో మొదటి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు గాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ధన్యవాదాలు. […]
READ MOREఅంబర్పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాథ బాలికల ఆశ్రమాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని యాదవ్ సందర్శించారు.బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి లోటు లేకుండా చసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వెంకటేశ్, ఇతర ఉన్నతాధికారులు బాలికలతో కలిసి భోజనం చేశారు. అనాధాశ్రమంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ […]
READ MORE









