తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును ప్రభుత్వం నియమించింది. కె.కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పటేల్ను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసింది. బీఎస్ రాములు అధ్యక్షతన ఏర్పాటైన తొలి కమిషన్ పదవీ కాలం ముగియడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త కమిషన్ను ఏర్పాటు చేసింది.ఉద్యమకారులు, సామాజిక సమీకరణలు పాటిస్తూ ప్రభుత్వం బిసి కమిషన్ను నియమించింది. గత బిసి కమిషన్లో పనిచేసిన సీనియర్ సభ్యులు అయిన వకుళాభరణంకు ఈ సారి ఛైర్మన్ […]
READ MOREదళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది. తొలివిడతగా ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలట్ ప్రాజెక్టుకు మొత్తం రూ.1000 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద రూ.2వేల కోట్ల విడుదల చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ […]
READ MOREహైదరాబాద్ బంజారాహిల్స్లో అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభోత్సవం నేడు జరిగింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్కు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ,ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, తెలంగాణ న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్లో మొదటి ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు గాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు ధన్యవాదాలు. […]
READ MOREఅంబర్పేట నియోజకవర్గ పరిధిలోని నింబోలి అడ్డాలో గల అనాథ బాలికల ఆశ్రమాన్ని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని యాదవ్ సందర్శించారు.బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి లోటు లేకుండా చసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే వెంకటేశ్, ఇతర ఉన్నతాధికారులు బాలికలతో కలిసి భోజనం చేశారు. అనాధాశ్రమంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ […]
READ MOREతెలంగాణ ఈ-సెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.ఈసెట్-2021 ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదలచేశారు.ఈసెట్లో 95.16శాతం మంది అభ్యర్థలు ఉత్తీర్ణత సాధించారు.ఆగస్టు 3న జరిగిన ఈసెట్ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)కు సుమారు 24 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థుల తమ ర్యాంకు కార్డులను https://ecet.tsche.ac.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఈ నెల 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే 26 నుంచి 29 వరకు అభ్యర్థుల […]
READ MOREపాఠశాలలను మూసివేయాల్సిన అవసరం లేకుండానే హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క స్కూలు కూడా మూసివేయకుండా టీచర్లను సర్దుబాటును చేయాలని భావిస్తున్నది.ఐదుగురు సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయ పోస్టులను నిర్ణయిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉం టే వారిని ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలకు బదిలీ చేస్తారు. విద్యార్థులు లేని స్కూళ్లకు కూడా ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టును కొనసాగిస్తూ కీలక […]
READ MOREకరోనాపై ఎడతెగని పోరాటం చేసి విజయం సాధించిన న్యూజిలాండ్( New Zealand )లో ఆరు నెలల తర్వాత స్థానికంగా సంక్రమించిన తొలి కేసు నమోదైంది.ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆ దేశం లాక్ డౌన్ ప్రకటించింది. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ మాట్లాడుతూ, ఈ కేసును డెల్లా వేరియంట్ గా అనుమానిస్తున్నట్టు చెప్పారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ మూడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని… […]
READ MOREసమాజంలో అట్టడుగువర్గాల జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని, దళితుల జీవితాల్లో పేదరికాన్ని శాశ్వతంగా తరిమికొట్టాలని.. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన సీఎం కేసీఆర్.ప్రతి దళిత ఉద్యోగితో పాటు రిటైర్డు ఉద్యోగులకు సైతం దళిత బంధు పథకం వర్తింపజేస్తామన్నారు.హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్టు సర్వే చెబుతోందని, ఒకవేళ కొత్తగా పెళ్లిళ్లు జరిగుంటే మరికొన్ని కుటుంబాలు అదనంగా ఉండొచ్చేమోనని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 17లక్షలకు పైగా ఎస్సి కుటుంబాలు ఉండగా, వారందరికి […]
READ MOREఆగస్టు 14వ తేదీని ఇక నుంచి విభజన స్మృతి దినంగా ( Partition Horrors Remembrance Day ) గుర్తించనున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను ఆగస్టు 15న జరుపుకుంటున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు. స్వాతంత్ర్యం రావడానికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ దేశం భారత్ నుంచి విడిపోయింది. ఆ విభజన సమయంలో కొన్ని లక్షల మందిని ఊచకోత కోశారు. కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. మన ప్రజల […]
READ MOREఇండిపెండెన్స్ డే సందర్భంగా పోలీసు పతకాలను కేంద్రహోంశాఖ ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు పతకాలు అందిస్తారు.ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీసు పతకాలు ( PPMG ) ప్రకటించగా, 628 మంది గ్యాలంటరీ పోలీసు పతకాలు ప్రకటించారు. 88 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు, 662 మందికి విశిష్ట సేవా పతకాలను అందించనున్నారు. తెలంగాణకు చెందిన 14 మందికి గ్యాలంటరీ పోలీసు పతకాలను అందిస్తారు. ఏపీకి చెందిన 11 మందికి గ్యాలంటరీ […]
READ MORE










