
ఢిల్లీలో రెండో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఈ వ్యక్తి దక్షిణాఫ్రికాకు కూడా వెళ్లొచ్చారు. ఒమైక్రాన్ రోగిని దేశ రాజధానిలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్లో చేర్చారు. ఢిల్లీ ఆసుపత్రిలో ఒమైక్రాన్ రోగుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.ముంబై నగరంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య శనివారం నాటికి 17కు పెరగడంతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో ముంబైలో మూడు కేసులు ఉండగా, పింప్రి ప్రాంతంలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. ముంబైలో ఒమిక్రాన్ బారినపడిన ముగ్గురు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. ఇందులో దేశంలోనే తొలిసారిగా మూడున్నరేళ్ల చిన్నారికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయింది.ముంబై మహానగరంలో శని, ఆదివారాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ రెండు రోజుల పాటు ర్యాలీలు, బహిరంగ సభలతో పాటు బయటి వాహనాల రాకపోకలపై నిషేధం విధిస్తూ ముంబై డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.




