
తెలంగాణ రాష్ట్రం తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ పర్యటనలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు.రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర సర్కారు 160 ఎకరా ల స్థలాన్ని 114 మంది ల బ్ధిదారుల నుంచి సేకరించి ఇచ్చింది. రైల్వే వ్యాగన్ యూనిట్ నిర్మాణంతో కేంద్రం చేతులు దులుపుకుంటున్నది. కచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీని ఏర్పా టు చేయాలి. ఉత్తరాదికి కాకుండా దక్షిణాదికి కూడా రైల్వేలో సరైన అవకాశాలు దక్కాలి. రైల్వే కొత్త ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4000 మందికి ఉద్యోగ కల్పన జరగనుంది అని రైల్వే అధికారులు అంటున్నారు. 2025 వరకు ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి యూనిటీ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.తెలంగాణ అనేక చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలకు నిలయంగా ఉందని కూడా ప్రధాన మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్లో గ్రానైట్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని మెరుగుపరచడానికి, అలాగే హైవేలు, ఎక్స్ప్రెస్వేలు, పారిశ్రామిక-ఆర్థిక కారిడార్ల అభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలను ఆయన నొక్కిచెప్పారు.
తెలంగాణలో రూ. 34,000 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రధాని వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. ఇటీవల రూ. 5,600 కోట్ల విలువైన రెండు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారని ప్రధాని వెల్లడించారు. కరీంనగర్ నుండి వరంగల్ వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి (NH 563), మంచిర్యాల నుండి వరంగల్ వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి (NH 163 G). తెలంగాణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కొనసాగిస్తున్న నిబద్ధతను తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.




