
ప్రతిష్ఠాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఐఎస్ బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 50 వేల మంది నిష్ణాతులుగా పట్టాలు పొందారని తెలిపారు. ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి అని పేర్కొన్నారు.ఎంతోమంది కృషి వల్లే ఐఎస్బీ ఈ స్థాయికి చేరిందన్నారు. జీ20 దేశాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఉద్ఘాటించారు. ఇంటర్నెట్ వినియోగంలోనూ, గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లోనూ భారత్ రెండో స్థానంలో ఉందని వివరించారు. యువత కోసమే దేశంలో ఎన్నో సంస్కరణలు చేస్తున్నాం. యువతతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రిఫామ్, పెర్ఫామ్, ట్రాన్స్ఫామ్ అందరికీ ముఖ్యం. దేశ పరిపాలన వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చాం.




