స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అలాగే ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏళ్లు వచ్చేవరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా […]
READ MOREఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బూత్లో ఆయన ఓటేశారు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల(రాజ్యసభ, లోక్ సభ) సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపరాష్ట్రపతి పదవి కోసం అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా .780 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో 543 మంది లోక్సభ, […]
READ MOREజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయనున్నామని చెప్పారు. 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి కార్మికుడు ఈ పథకానికి అర్హుడుగా ఉంటాడని, దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల రూపాయల బీమా ఇస్తామన్నారు. రాష్ట్రంలోని సుమారు 80వేల మంది నేత కార్మికులకు […]
READ MOREహైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్మేయడంతో వాతావరణం చల్లబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, కూకట్పల్లి, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బషీర్బాగ్, అమీర్పేట, తర్నాక, చింతల్బస్తి, సోమాజిగూడ, నాంపల్లి, లక్డీకపూల్, కోఠిలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలతో చెరువులు, కుంటలు ఇప్పటీకే నిండు కుండలను తలపిస్తుండడంతో మళ్లీ వర్షం కురువడంతో పరిసర ప్రాంతాల వాసులు ఎక్కడినుంచి ఏ క్షణంలో వరద ముంచుకువస్తోందని భయాందోళనలకు […]
READ MOREనీటిపై తేలియాడే సోలార్ పలకలతో 100 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న (ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు) ఎన్టీపిసి రామగుండం ప్రాజెక్టును నేడు ప్రధాని మోడీ జాతికి అంకితం. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు తెలంగాణలో ఆవిష్కృతం కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్టీపీసీ జలాశయంలో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ […]
READ MOREతెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ […]
READ MOREమహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఇనుగుర్తిని నూతన రెవెన్యూ మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి ఉన్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 607 మండలాలుండగా, తాజాగా మరో కొత్త మండలం ఏర్పాటుతో సంఖ్య 608కి పెరగనుంది.
READ MOREముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపనున్నారు. విపక్షాలకు చెందిన కొందరు కీలక నేతలను కూడా ఆయన కలవనున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్ తో పాటు కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
READ MOREతెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వైద్యాధికారులతో ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని వైద్య అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
READ MOREరాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంటు వేదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ముర్ముకు పోలైన 540 ఓట్ల విలువ సుమారు 3,78,000 ఉంటుంది. ఇక యశ్వంత్కు 208 ఓట్ల లెక్క విలువ 1,45,600 ఉంటుంది. ఇవన్నీ పార్లమెంట్ ఓట్లు మాత్రమే. […]
READ MORE










