నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్హాట్, ఆసిఫ్నగర్, జియాగూడ, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బహదూర్పురా, ఫలక్నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్, బేగంపేట, అల్వాల్, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్పల్లి, మారేడుపల్లి, హైటెక్సిటీ, నాంపల్లి, కోఠి, మలక్పేట్, చైతన్యపురి, అంబర్పేట్, ముసారాంబాగ్, దిల్సుఖ్నగర్లో భారీ […]
READ MOREతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్దన్ రెడ్డి మృతి పట్ల తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. వారి సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. అనంతరం సభను 12వ తేదీకి వాయిదా వేశారు. తమ శాఖలకు చెందిన నివేదికలను విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి, పర్యాటక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ వాయిదా అనంతరం స్పీకర్ చాంబర్లో బిజినెస్ […]
READ MOREఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్లో 48,816 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు.వొకేషన్లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 65.07గా నమోదైంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ […]
READ MOREదేశ చరిత్రలో తొలిసారిగా సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేటితో పదవీ కాలం పూర్తి చేసుకోనున్నారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలపై విచారణను ప్రత్యక్షప్రసారం చేసింది. రాజకీయ పార్టీల ఉచితాలపై త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పు పునఃపరిశీలనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లిలతో కూడిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎన్నికల ప్రజాస్వామ్యంలో నిజమైన అధికారం ఓటర్లదేనని అభిప్రాయపడింది. పార్టీల […]
READ MOREతెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత డా.పత్తిపాక మోహన్కు ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహితీ పురస్కారం లభించింది. సిరిసిల్ల నేలపై మెరిసిన సాహిత్య రత్నం మోహన్ : సీఎం కేసీఆర్ 2022 సంవత్సరానికి గానూ కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురస్కారం’కు డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హర్షం వ్యక్తం చేశారు. మోహన్ రాసిన ‘బాలల తాత బాపూజీ’ పాటకు ఘన విజయం దక్కడం గొప్ప తరుణమని కేసీఆర్ […]
READ MOREప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, ప్రస్తుత పరిస్థితులపై ఈ సమీక్ష సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, లా అండ్ అర్డర్ అడిషనల్ డీజి, సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ భగవత్లు హాజరయ్యారు.
READ MOREమునుగోడు నియోజకవర్గంలో శనివారం జరగబోయే ప్రజాదీవెన సభకు ఆ పార్టీ శ్రేణులుముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు.
READ MOREరాష్ట్ర హైకోర్టులో కొత్త జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్, నగేష్, పి. కార్తీక్, కె. శరత్లు ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24 ఉండగా.. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
READ MORE75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(అగస్ట్16న) సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11గం.30ని. ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ జనగణమన ఆలపించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అబిడ్స్ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖలు, అధికారులు పాల్గొన్నారు. అన్ని ప్రధాన కూడళ్లల్లో రెడ్ సిగ్నల్స్ను వేసి.. నిమిషం […]
READ MOREభారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో దర్భార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేసిన ధన్కర్ ఎన్డీయే అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ […]
READ MORE










