
హైదరాబాద్-నాగార్జున్సాగర్ రోడ్డు వెంట తుర్కయాంజల్లో 9.5 ఎకరాల్లో హెచ్ఎండీఏ (HMDA) లేఅవుట్ చేసింది.ఈ లేఅవుట్లో కేవలం 34 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. బిల్డర్లు, డెవల్పమెంట్ సంస్థలు, వివిధ కంపెనీలు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక్కో ప్లాట్ విస్తీర్ణం 600 చ.గజాల నుంచి 1060 చ.గజాల వరకు ఉండే విధంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎం డీఏ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. రిజిస్ర్టేషన్ (Registration) చేసుకోవడానికి జూన్ 28 వరకు అధికారులు గడువు విధించారు.ఒక్కో ప్లాట్కు రూ.5 లక్షలు చెల్లించాలి.తుర్కయాంజాల్లోని ప్లాట్లకు అప్సెట్ ప్రైస్ చదరపు గజానికి రూ.40వేలుగా నిర్ణయిం చారు. అప్సెట్ ప్రైస్ కన్నా కనీసం రూ.500 గానీ, అంతకు రెట్టింపులోగానీ వేలంలో ధరను పెంచాల్సి ఉంటుంది. ఈ–వేలం రెండు విడతల్లో జూన్ 30 సాయం త్రం 5 వరకు నిర్వహిస్తారు. గత సంవత్సరం రంగారెడ్డి జిల్లా పరిధి లోని కోకాపేట, ఉప్పల్ భగాయత్లలో భూ ముల అమ్మకం ద్వారా సుమారు రూ.2,500 కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం ఈసారి సుమారు రూ.500 కోట్ల ఆదాయం సమకూర్చుకు నేందుకు కార్యాచరణ ప్రారంభించింది.




