
మన చరిత్రకి, వారసత్వ సంపదకు, గొప్ప సంస్కృతికి నిదర్శనంగా నిలిచే బన్సీలాల్పేట మెట్లబావి చారిత్రక సంపద అని, దానిని కాపాడుకుంటూ భావితరాలకు అందివ్వాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏనలేని కృషి చేస్తోందని, వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం రూ.10కోట్ల వ్య యంతో బన్సీలాల్పేట మొట్ల బావి పునురద్దరణ పనుల చేపట్టి పూర్వ వైభాన్ని తీసుకువచ్చిందన్నారు. 108 ఎకరాల్లో విస్తరించి ఉన్న కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద ఆరు మెట్లబావులను ఆగాఖాన్ ఫౌండేషన్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఆధునికీకరించిందని, వాటికి ఇటీవల యునెస్కో గుర్తింపు దక్కడం గర్వంగా ఉన్నదని చెప్పారు. 13 నెలలపాటు శ్రమించిన రెయిన్వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనారమేశ్, గండిపేట వెల్ఫేర్ సోసైటీ ప్రతినిధి రాజశ్రీ, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. మొజంజాహీ మార్కెట్, మీరాలం మండి, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, షేక్పేట సరాయి, పలు దేవ్డీలకు పూర్వవైభవం సంతరించుకునేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు .




