
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ సర్కారీ బడులు తెరవాల్సి ఉంది. ఇప్పటికే అధికారులు సర్వం సిద్ధం చేయగా.. హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో విచారణ జరిగింది. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులపై ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకంగా ఎలాంటి హామీలు తీసుకోరాదని చెప్పింది. ప్రత్యక్ష తరగతులపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకూడదని ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఆన్ లైన్ బోధనను కొనసాగించాలని ఆదేశించింది.సెప్టెంబర్ – అక్టోబర్లో కోవిడ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుందని నివేదిక అందించిన డబ్ల్యూహెచ్ఓకు ఏం చెబుతారని హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్ టీకా పూర్తి కాలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.తరగతులకు హాజరుకాని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది. ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించని స్కూల్స్ పైనా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్లాసులపై స్కూల్స్ నిర్ణయించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. గురుకులాలు, హాస్టల్స్ తెరవొద్దని తెలిపింది. పాఠశాలల పునఃప్రారంభంపై ఇప్పటికే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామంటోంది ప్రభుత్వం. దీని వల్ల కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో… ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష బోధన వద్దని కోర్టును కోరారు. ఇప్పటికే విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులతో వర్చువల్ మీటింగ్ లో పాల్గొని.. తగిన సలహా సూచనలు చేశారు. పారిశుధ్య- శానిటైజేషన్- తాగునీరు- విద్యుత్ తదితర సౌకర్యాల పునరుద్దరణ చేసి తీరాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.




