ఇంటర్ లో బాలికలదే పైచేయి..జూన్ 4 ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు : మంత్రి సబితా
admin May 9, 2023 0 COMMENTS
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ప్రధాన కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులను తొలగించామని విద్యాశాఖ మంత్రి తెలిపారు. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్లో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి వెల్లడించారు. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా టాప్ లో నిలవగా.. సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు.ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించామన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు వివరాలు, టైం టేబుల్ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఈ ఫలితాలను https://tsbie. cgg.gov.in, https://results.cgg.gov.in వెబ్సైట్లలో చూడవచ్చు.ఇంటర్ విద్యార్థుల కోసం టెలీ మానస్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని విద్యాశాఖ ఉన్నతాధికారి నవీన్ మిట్టల్ తెలిపారు. 14416 నెంబర్కు పోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చన్నారు. సాయంత్రం నుంచి మెమోలు కలర్ ప్రింటవుట్ తీసుకోవచ్చన్నారు.




