ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపనున్నారు. విపక్షాలకు చెందిన కొందరు కీలక నేతలను కూడా ఆయన కలవనున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చించనున్నారు. కేసీఆర్ తో పాటు కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.
READ MOREతెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వైద్యాధికారులతో ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బూస్టర్ డోసు పంపిణీ వేగం పెంచాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని వైద్య అధికారులు, సిబ్బంది తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా మందులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
READ MOREరాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఓట్లు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు 208 ఓట్లు పోల్ అయినట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంటు వేదికగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఎంపీల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ముర్ముకు పోలైన 540 ఓట్ల విలువ సుమారు 3,78,000 ఉంటుంది. ఇక యశ్వంత్కు 208 ఓట్ల లెక్క విలువ 1,45,600 ఉంటుంది. ఇవన్నీ పార్లమెంట్ ఓట్లు మాత్రమే. […]
READ MOREశ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ ను శ్రీలంక పార్లమెంటు ఎన్నుకుంది. 221 ఓట్లకు గాను 134 ఓట్లు విక్రమసింఘేకు వచ్చాయి. అయన ప్రధాన ప్రత్యర్థి దులాస్ అలహప్పెరుమకు 82 ఓట్లు లభించగా.. లెఫ్టిస్ట్ అనురా దిసానాయకు కేవలం మూడు ఓట్లు మాత్రమే. మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స దేశం విడిచి వెళ్తూ ప్రధాని రణిల్ విక్రమసింఘేను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. శ్రీలంక 8వ అధ్యక్షుడిగా విక్రమ […]
READ MOREభద్రాచలం వరద ముంపు బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులకు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పక్కనే ఉన్న గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కోరుతున్నాం. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందని తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కరకట్టలు గతంలో కట్టినా అవి పటిష్టంగా లేవు అని, సిఎం కెసిఆర్ శాశ్వత […]
READ MOREరాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్లు సైతం ఓటు వేశారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఈ నెల […]
READ MOREనిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ఇప్పటికే నిండిపోయింది. దీంతో ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో ఆనకట్ట పైనుంచి వరద ప్రవహిస్తున్నది. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వరద […]
READ MOREతెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ నెల 18న సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా వర్షాల కారణంగా […]
READ MOREఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎమర్జెన్సీ కోసం DRF టీమ్స్ అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈనెల 8 నుంచి గ్రేటర్లో వర్షం పడుతూనే ఉంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి జల్లులు పడినప్పటికీ.. సాయంత్రం 5 గంటల తర్వాత మోస్తరు వర్షం పడింది. వర్షాల నేపథ్యంలో చాలామంది మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో వివిధ మార్గాల్లో నడిచిన […]
READ MOREఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 53.90అడుగులకు పెరిగింది. అధికారులు సోమవారం సాయంత్రానికే మూడవ ప్ర మాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరితోపా టు దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.











