ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనలైజ్ చేసిన 6గురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా కొద్ది సేపటి కిందటే విడుదలైంది. కడియం శ్రీహరి(వరంగల్),తక్కళ్లపల్లి రవీందర్ రావు (మహబూబా బాద్),గుత్తా సుఖేందర్ రెడ్డి (నల్లగొండ),పాడి కౌశిక్ రెడ్డి (కరీంనగర్),మాజీ కలెక్టర్ వెంకట్రాం రెడ్డి(సిద్ధిపేట)బండ ప్రకాష్ పేర్లు ఖరారయ్యాయి.అసెంబ్లీలో టీఆర్ఎస్ సంఖ్యా బలాన్ని బట్టి ఈ ఆరుగురూ ఎమ్మెల్సీలు దాదాపు ఏకగ్రీవంగానే ఎన్నిక కానున్నారు.ఖరారైన ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు […]
READ MOREసిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఐఏఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖను అందించారు. వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్నాను. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. కేసీఆర్కు అత్యంత […]
READ MOREవస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని చేనేత, జౌళి, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీకి వెళ్లి వ్యక్తిగతంగా కలిసి ఈ విషయాన్ని గుర్తు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన చెప్పారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం కేటీఆర్ మరోసారి లేఖరాశారు.సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. చేనేత, […]
READ MOREఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు.నిలోఫర్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన 100 పడకల యూనిట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడారు.కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.18 కోట్లు అందించామని చెప్పారు. రూ.10 వేల కోట్లు కేటాయించి ఆరోగ్యశాఖను అభివృద్ధి చేశామని మంత్రి వెల్లడించారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ఉన్న డెలివరీ రేట్.. కేసీఆర్ కిట్ వచ్చాక 50 […]
READ MOREహైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో జరిగిన 73వ బ్యాచ్ ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్కు (IPS probationers passing out parade) దోవల్ ముఖ్య అతిథిగా హాజయర్యారు. ఈ బ్యాచ్లో 149 మంది ప్రొబేషనరీలు బేసిక్ కోర్సు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో తెలంగాణ కేడర్కు నలుగురు, ఏపీ కేడర్కు ఐదుగురిని కేటాయించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఎనిమిది మంది ప్రొబేషనరీలకు అజిత్ దోవల్ ట్రోఫీలు అందజేశారు.దేశ భద్రతలో పోలీస్ సర్వీస్ వెన్నెముక లాంటిదని […]
READ MOREఆర్థిక మంత్రి హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖను అదనంగా అప్పగించారు. ఈ దస్త్రంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంతకం చేశారు. ఇప్పటి వరకు హరీశ్ రావు ఆర్థిక శాఖను మాత్రమే పర్యవేక్షించేవారు. ఇక నుంచి రెండు శాఖలను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. ప్రస్తుతం ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉంది.అప్పట్లో వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చూసిన ఈటల రాజేందర్పై భూకబ్జా ఆరోపణలు రావడంతో ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి […]
READ MOREతెలంగాణలో నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడేండ్లలో లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో మరో 60 నుంచి 70వేల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.సోమవారం ప్రగతిభవన్లో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ఏటా ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. యువతకు మేలుచేకూర్చే నిర్ణయాలు ఎన్నో తీసుకొన్నామని, కొత్త జోనల్ వ్యవస్థే అందుకు నిదర్శమని తెలిపారు. దేశంలోనే నిరుద్యోగం తక్కువ ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని, అయినా బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. […]
READ MOREహుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ విధించారు. ఇప్పటి వరకు నాలుగు రౌండ్లు పూర్తయ్యాయి.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగుతున్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లో 1,695 ఓట్ల మెజారిటీ పొందారు. మొత్తంగా ఈటలకు 2,958 […]
READ MOREతెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఫ్రాన్స్కు చెందిన చిన్న, మధ్య తరహా సంస్థలు ముందుకొస్తే వారికోసం ప్రత్యేకంగా పారిశ్రామిక సముదాయాన్ని (క్లస్టర్) అభివృద్ధి చేసేందుకు సుముఖంగా ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న కేటీఆర్, శుక్రవారం ప్యారిస్లోని ఆ దేశ సెనేట్లో ‘యాంబిషన్ ఇండియా 2021’ బిజినెస్ ఫోరంలో కీలకోపన్యాసం చేశారు. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న ప్రగతిశీల విధానాలను వివరించారు. ‘గ్రోత్: డ్రాఫ్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండో ఫ్రెంచ్ రిలేషన్స్ […]
READ MOREకొవిడ్-19 టీకా కార్యక్రమంలో వీఐపీ కల్చర్ ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అక్టోబర్ 21(గురువారం) వరకు భారత్ 100 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వినియోగించిన దేశంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఇది ప్రతీ భారతీయుడి విజయం అని.. దేశ సామర్థ్యానికి ప్రతీక అని ప్రశంసించారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి భారతీయుడికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం 100 కోట్ల కరోనా టీకా […]
READ MOREBestehende Spieler nutzen https://rollingslotsbonus.de/konto-login, um schnell auf ihr Konto zuzugreifen. Bonusstatus, Einzahlungsverlauf und Auszahlungsoptionen sind übersichtlich abrufbar. Moderne Sicherheitsstandards garantieren Datenschutz und geschützte Authentifizierung.










