మునుగోడు నియోజకవర్గంలో శనివారం జరగబోయే ప్రజాదీవెన సభకు ఆ పార్టీ శ్రేణులుముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మునుగోడు చేరుకుంటారు. సుమారు నాలుగు వేల కార్లతో కూడా భారీ కాన్వాయ్తో ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు. సుమారు లక్షన్నర మంది కూర్చునేలా 25 ఎకరాల్లో ఇప్పటికే సభా ఏర్పాట్లు పూర్తిచేశారు.
READ MOREరాష్ట్ర హైకోర్టులో కొత్త జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టు జడ్జిలుగా శ్రీనివాసరావు, రాజేశ్వరరావు, వేణుగోపాల్, నగేష్, పి. కార్తీక్, కె. శరత్లు ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24 ఉండగా.. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
READ MORE75వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం(అగస్ట్16న) సామూహికంగా జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11గం.30ని. ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా అందరూ జనగణమన ఆలపించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. అబిడ్స్ జీపీవో నెహ్రూ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర రాజకీయ ప్రముఖలు, అధికారులు పాల్గొన్నారు. అన్ని ప్రధాన కూడళ్లల్లో రెడ్ సిగ్నల్స్ను వేసి.. నిమిషం […]
READ MOREభారత 14వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో దర్భార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పని చేసిన ధన్కర్ ఎన్డీయే అభ్యర్థిగా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ […]
READ MOREస్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ పలు ఆఫర్లను ప్రకటించింది. ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అలాగే ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏళ్లు వచ్చేవరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం.ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా […]
READ MOREఉపరాష్ట్రపతి ఎన్నికకు ఇవాళ పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్లో ఏర్పాటు చేసిన బూత్లో ఆయన ఓటేశారు. ఈ ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల(రాజ్యసభ, లోక్ సభ) సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉపరాష్ట్రపతి పదవి కోసం అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్కర్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా .780 మంది ఎంపీలు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. దీంట్లో 543 మంది లోక్సభ, […]
READ MOREజాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ (KTR) వెల్లడించారు. అందులో భాగంగా చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయనున్నామని చెప్పారు. 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి కార్మికుడు ఈ పథకానికి అర్హుడుగా ఉంటాడని, దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల రూపాయల బీమా ఇస్తామన్నారు. రాష్ట్రంలోని సుమారు 80వేల మంది నేత కార్మికులకు […]
READ MOREహైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్మేయడంతో వాతావరణం చల్లబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, కూకట్పల్లి, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బషీర్బాగ్, అమీర్పేట, తర్నాక, చింతల్బస్తి, సోమాజిగూడ, నాంపల్లి, లక్డీకపూల్, కోఠిలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఈ నెల 3,4 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలతో చెరువులు, కుంటలు ఇప్పటీకే నిండు కుండలను తలపిస్తుండడంతో మళ్లీ వర్షం కురువడంతో పరిసర ప్రాంతాల వాసులు ఎక్కడినుంచి ఏ క్షణంలో వరద ముంచుకువస్తోందని భయాందోళనలకు […]
READ MOREనీటిపై తేలియాడే సోలార్ పలకలతో 100 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న (ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు) ఎన్టీపిసి రామగుండం ప్రాజెక్టును నేడు ప్రధాని మోడీ జాతికి అంకితం. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్బంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు తెలంగాణలో ఆవిష్కృతం కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్టీపీసీ జలాశయంలో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.ఈ […]
READ MOREతెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నేడు వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ […]
READ MORE










