దక్షిణాఫ్రికాలో కొవిడ్19 కొత్త వేరియంట్ వెలుగు చూడటంతో బ్రిటన్, ఇయు దేశాలుసహా ప్రపంచం అప్రమత్తమైంది.ఈ వేరియంట్ ఇప్పటికే ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్వానాతోపాటు కొన్ని పొరుగుదేశాలకు వ్యాప్తి చెందింది. దాంతో, బోట్స్వానా, లెసోథో, ఎస్వాతిని, జింబాంబ్వే, నమీబియా దేశాల నుంచి ప్రయాణాలపై శుక్రవారం నుంచి నిషేధం విధిస్తున్నట్టు యుకె ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్19 స్పైక్ ప్రోటీన్లో పెద్ద సంఖ్యలో మ్యుటేషన్స్ (ఉత్పరివర్తనాలు)ను గుర్తించినట్టు యుకె ఆరోగ్య భద్రతా ఏజెన్సీ(ఉఖ్సా) పేర్కొన్నది. వైరస్ జీనోమ్లోని మిగతా భాగాల్లోనూ మ్యుటేషన్స్ను గుర్తించారు.అంతర్జాతీయ […]
READ MOREపార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఇవాళ రాజ్యాంగ దినోత్సవ సంబరాలను నిర్వహించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఆ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారికి మోడీ నివాళులర్పించారు. 2008లో ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించి వందలాది మంది అమాయక పౌరులను హతమార్చిన ఈరోజు 26/11 కూడా […]
READ MOREప్రముఖ నేపథ్య గాయిని హరిణి కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయి. వారం రోజులుగా హైదరాబాద్ లోని వారి ఇంటికి తాళం పెట్టి ఉంది. బంధువులు ఎంత ట్రై చేసినా వారి ఆచూకీ తెలియరాలేదు. ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. బెంగళూరులోని రైల్వేట్రాక్పై ఏకే రావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏకే రావు శరీరంపై […]
READ MOREగాల్వాన్ ఘటనలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కార ప్రదానం జరిగింది.రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. కాగా యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు అందజేసే రెండో అత్యున్నత పురస్కారమే మహావీర్ చక్ర. గతేడాది జూన్ లో తూర్పు లద్దాఖ్ గల్వాన్ వ్యాలీలో చైనా ఆర్మీ దాడిని ప్రతిఘటించిన ఘటనలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం […]
READ MOREతెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపనున్నారు. రెండు, మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ కేటాయింపులు, రాష్ట్ర విభజన అంశాలపై ఈ పర్యటనలోకేంద్రంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. యాసంగి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే సిఎం కెసిఆర్ పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంత్రుల సమావేశంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించిన విషయం విధితమే. […]
READ MOREభారత దేశంలో తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. ఇదే నెలలో జరిగే శీతాకాల సమావేశాల్లో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ను ఐదు రెట్లు పెంచినట్లు వెల్లడించారు. గ్రామీణ మౌళిక సదుపాయాల మార్కెట్ను బలోపేతం చేశామన్నారు. ఎంఎస్పీ పెంచామన్నారు. రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లను పెంచామన్నారు. తాము చేపట్టిన […]
READ MOREతెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతుల మహాధర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్రజాప్రతినిధులందరికీ సీఎం కేసీఆర్ స్వాగతం తెలిపారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న టీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన సీఎం…ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఇక యుద్ధం ఆగబోదని అన్నారు.పంజాబ్లో వడ్లు కొన్న తీరుగానే తెలంగాణలోనూ కొనాలని తాము డిమాండ్ చేశామని, ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని ఢిల్లీకి పోయి అడిగినా కేంద్రం […]
READ MOREతెలంగాణ అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగం గణనీయ ప్రగతి సాధించిన సంగతి తెలిసిందేనని.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు ఏటా ఎకరాకు పదివేల రూపాయల పంటపెట్టుబడి సాయం అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. సాగునీటి లభ్యత పెరిగాక, ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా మారడంతోపాటు దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ మారిందని వివరించారు.ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్రానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈనెల […]
READ MOREఅత్యుత్తమ పర్యాటక గ్రామంగా ‘భూదాన్ పోచంపల్లి’ ఐక్యరాజ్యసమితి గుర్తింపు
admin November 16, 2021 0 COMMENTSతెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.రాష్ట్రంలోని పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (UNWTO) ఉత్తమ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. ఇదే విషయాన్ని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది. భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.ఈ అవార్డు కోసం భారత్ నుంచి మేఘాలయలోని […]
READ MOREవచ్చే ఏడాది టీ20 క్రికెట్ వరల్డ్కప్ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీకి చెందిన ఏడు వేదికలను ఖరారు చేశారు. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 45 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకు బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబార్ట్, పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్ నగరాలను వేదికలుగా అధికారులు ప్రకటించారు. సిడ్నీ, అడిలైడ్లలో సెమీస్లు జరగనుండగా, నవంబర్ 13న మెల్బోర్న్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.టీ20 వరల్డ్కప్ కోసం 12 జట్లు […]
READ MORE










