రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.ష్ట్రంలో మరో 3,334 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. అటవీశాఖలో 1668, అగ్నిమాపక శాఖలో 875, ఎక్సైజ్ శాఖలో 791 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు తొలి విడతగా 30 వేల 453 ఖాళీల భర్తీ అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు విడివిడిగా జీవోలు జారీ చేశారు. శాఖల వారీగా […]
READ MOREకేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఏటా ఒక్కో ఎంపీకి పది సీట్లు కేటాయించింది. ప్రవేశాల కోసం ఎంపీల కోటాను పెంచాలని ఇటీవలే డిమాండ్ వచ్చింది. ఎంపీల కోటాను రద్దు చేసే యోచనలో ఉందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం మొత్తం కోటానే రద్దు చేసింది.
READ MOREవిశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది.ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనేజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్లో భాగమైన అర్బోర్ డే ఫౌండేషన్ గుర్తించిన ప్రపంచ ట్రీ సిటీల్లో హైదరాబాద్కు చోటు దక్కింది. దేశంలో రెండు నగరాలకే చోటు దక్కగా, అందులో హైదరాబాద్ ఒకటిగా ఉండటం విశేషం. గత రెండేళ్లలో దాదాపు 3,50,56,635 మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాలతో పచ్చదనం పెంపొందించడంలో ఉత్తమ ఫలితాలు సాధించిన హైదరాబాద్ నగరానికి వరుసగా రెండో సంవత్సరం కూడా ఈ […]
READ MOREయాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహ స్వామి వారిని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మా నందేంద్ర సరస్వతి స్వామి వారు దర్శించుకున్నారు.గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధానాలయ నిర్మాణాలను పరిశీలించారు. త్యద్భుతమైన కట్టడం యాదగిరిగుట్ట, శ్రీ కృష్ణ దేవరాయలులా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అత్యద్భుతంగా నిర్మించారని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వ్యాఖ్యానించారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత దర్శించుకున్న మొట్టమొదటి పీఠాధిపతి.యాదగిరిగుట్ట టీటీడీ స్థాయికి ఎదగాలని […]
READ MOREఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక సంచలన ప్రకటన చేసింది. విదేశాల నుంచి తీసుకున్న అప్పులను ఇకపై తాము కట్టలేమని, వాటిని ఎగ్గొట్టేస్తామని ఆ దేశ ఆర్థిక శాఖ ప్రకటించింది.కొవిడ్తో లంక ఆర్థిక స్థితి కుప్పకూలింది. క్షీణించిన విదేశీ నిల్వలు కారణంగానే.. ఆర్థిక సంక్షోభంలోకి దేశం కూరుకుపోయింది. మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే మన దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది. దేశానికి విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెట్టే పర్యాటక రంగం లాక్డౌన్లతో దెబ్బతింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిసినప్పటికీ.. లాక్డౌన్ విధించాల్సి […]
READ MOREతెలంగాణ కేబినెట్ రేపు(మంగళవారం) అత్యవసరంగా సమావేశంకానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు.ఢిల్లీ తెలంగాణ భవన్లో కేసీఆర్ చేపట్టిన దీక్షలో ధాన్యం కొనుగోలు ప్రభుత్వమే చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
READ MOREభద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. సోమవారం గవర్నర్ దంపతులు సీతారాముల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు. అనంతరం తమిళి సై మాట్లాడుతూ భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. గవర్నర్ పర్యటనకు కలెక్టర్, ఎస్పీ గైర్హాజరయ్యారు.
READ MOREముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై పంచాయితీ ఢిల్లీకి చేరింది. తనకు జరుగుతున్న అవమానాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై ఫిర్యాదు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గురువారం నాడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం మొదలు […]
READ MOREడ్రగ్స్ తీసుకున్న ఐటీ ఉద్యోగులపై వేటు పడింది. 13 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగించాయి. మరో 50 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు నోటీసులు అందజేశాయి. టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి, తాజాగా ఓ పబ్ లో డ్రగ్స్ భాగోతం బయట పడేంత వరకు కూడా అంతా సంచలనమే. సాఫ్ట్వేర్లకు డ్రగ్స్ అమ్మినట్టు తేలడంతో పోలీసులు కంపెనీలకు లేఖలు రాశాయి అమెజాన్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, మహేంద్ర, క్యూసాఫ్ట్ కంపెనీ ఉద్యోగులు.. ప్రేమ్కుమార్, టోనీ, లక్ష్మిపతి […]
READ MOREసిద్దిపేట జిల్లాలో కోకాకోలా సంస్థ రూ. 1,000 కోట్ల పెట్టుబడులు : మంత్రి కేటీఆర్
admin April 7, 2022 0 COMMENTSరాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ నేడు నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో రూ. 600 కోట్ల పెట్టుబడులు పెట్టడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. నూతన పరిశ్రమ కోసం ఇక్కడ 48.53 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. కోకాకోల సంస్థ 25 ఏళ్లుగా సేవలందిస్తోందని కేటీఆర్ చెప్పారు. మహిళలకు అత్యధికంగా ఉపాధి కల్పిస్తామని హిందూస్థాన్ కోకోకోలా వెల్లడింది. కొత్త పరిశ్రమ ద్వారా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని […]
READ MORE










