ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడిన విషయం తెలిసిందే. పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు, క్షతగాత్రులకు రూ.50 పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి అదిస్తామని ప్రధాని ట్విటర్ ఖాతాలో చెప్పారు.
READ MOREతమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి ఏడాది కాలం ముగిసింది. శనివారం ఉదయం చెన్నై నగరంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బస్ లో అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో స్టాలిన్ మాట్లాడారు. తన ప్రభుత్వం ఏడాది పాలన గురించి ఏమనుకుంటున్నారు? అంటూ బస్సు కండక్టర్, ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకించి మహిళా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ పథకం గురించి అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. మెరీనా బీచ్ బస్సులో చేరుకున్న సీఎం స్టాలిన్.. అక్కడ ఉన్న మాజీ సీఎం కరుణానిధి […]
READ MOREవరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం హవేలీలోని కాకతీయ మెగా టైక్స్టైల్ పార్కులో ఏర్పాటు చేస్తున్న కైటెక్స్ టెక్స్టైల్ పరిశ్రమకు భూమిపూజ చేశారు.మిషన్ భగీరథ, వాటర్ ట్యాంక్కు శంకుస్థాపన చేశారు. మంత్రి గణేష్ ఈకో టెక్స్ టైల్ పార్క్ను ప్రారంభించారు.
READ MOREఅన్ని ధరలు పెరిగి అల్లాడుతున్న సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడింది. ఈ ఉదయాన్నే సామాన్య ప్రజలకు గుండె గుభేల్ మనిపించే చేదు వార్తను చమురు సంస్థలు వినిపించాయి. ఒక్కసారిగా రూ. 50 పెంచేశాయి చమురు సంస్థలు. దీంతో గ్యాస్ సిలిండర్ ధర రూ.1052కు చేరింది. దీనికి డెలివరీ బాయ్స్ తీసుకునే రూ.30 కలిపితే రూ.1082 అవుతుంది. పెంచిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. ఇక నెల గ్యాప్ తర్వాత ఇప్పుడు యాభై రూపాయలు పెంచాయి కంపెనీలు. డొమెస్టిక్ సిలిండర్లపై […]
READ MOREతెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నదని దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.హైదరాబాద్తోపాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్లో తెల్లవారుజామున ప్రారంభమైన వాన గంటపాటు దంచికొట్టింది. దీంతో నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. యాదగిరిగుట్టలో భారీ వర్షానికి ఘాట్ రోడ్డు కుంగిపోయింది. దీంతో కొండపైకి రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల కుంగిన రోడ్లతో వాహనదారులు తీవ్ర […]
READ MOREరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana uru-Mana badi) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ… 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే టీచర్లకు కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలను […]
READ MOREభారత ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతల్లో వున్న జనరల్ ఎం.ఎం. నరవాణే శనివారం పదవీ విరమణ చేశారు. జనరల్ నరవనేతోపాటు సైన్యంలోని అన్ని స్థాయులవారు జనరల్ పాండేను అభినందిస్తున్నట్లు తెలిపింది. కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి మొదటి సారిగా ఆర్మీ చీఫ్గా ఎన్నిక కావడం ఇదే ప్రథమం. ఆర్మీ చీఫ్ కోసం కేంద్రం జైసింగ్ నయన్, అమర్దీప్ సింగ్ భిందర్, యోగేంద్ర దిమ్రీ పేర్లను […]
READ MOREఅమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్.. ఇప్పుడు గూగుల్. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ నగరం శాశ్వత కూడలి అవుతున్నది.హైదరాబాద్లో దశాబ్ద కాలం పాటు ఒక ల్యాండ్ మార్క్గా నిలవబోయే ఈ క్యాంపస్కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఈ కొత్త ఆఫీసును 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ నిర్మించబోతోంది. డిజిటల్ తెలంగాణ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రభుత్వం మరో ముందడుగు పడిందని రాష్ట్ర మంత్రి కెటిఆర్ తెలిపారు. కార్యాలయ ఏర్పాటుకు […]
READ MOREటీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం మాదాపూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ”టీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు టీఆర్ఎస్ ఒక రక్షణ కవచం అన్నారు. తెలంగాణ ప్రజల కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ అని, దేశంలో 10 ఉత్తమైన గ్రామాల్లో అన్ని తెలంగాణ పల్లెలే ఉన్నాయన్నారు. దేశంలో 20 ఉత్తమ గ్రామాల్లో కూడా 19 […]
READ MOREతెలంగాణలో పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుళ్లు, ఎస్ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, మిగతా 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం www.tslprb.in వెబ్సైట్ను సంప్రదించొచ్చు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మే నెల 2 నుంచి 20 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ పోలీసు ఉద్యోగాలకు వయో పరిమితిని […]
READ MORE










