
ఎగువ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో నీటిమట్టం 53.90అడుగులకు పెరిగింది. అధికారులు సోమవారం సాయంత్రానికే మూడవ ప్ర మాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరితోపా టు దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య రాకపోకలు స్తంభించాయి. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు వద్ద 22 గేట్లు ఎత్తారు. 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 175 గేట్లు ఎత్తి 13 లక్షల క్యూసెక్కుల నీరును సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. ఎగువన మహారాష్ట్రతోపాటు చత్తిస్గడ్ , ఒడిశా రాష్ట్రాల్లో కూడా గోదావరితోపాటు దాని ఉపనదులు ఉధృతంగా ప్రహహిస్తున్నాయి.




