
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. సోమవారం గవర్నర్ దంపతులు సీతారాముల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి రైలులో బయలుదేరిన గవర్నర్ తమిళిసై కొత్తగూడెం చేరుకున్నారు. అనంతరం తమిళి సై మాట్లాడుతూ భక్త రామదాసు నిర్మించిన ఆలయాన్ని, సీతారాములను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ పర్యటనలో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. గవర్నర్ పర్యటనకు కలెక్టర్, ఎస్పీ గైర్హాజరయ్యారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




