
తెలంగాణ రైతాంగనికి పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తోన్న రైతు బంధు నిధుల పంపిణీ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. అందరికీ రైతుబంధు పథకం అందుతుందని, ఎవ్వరి కూడా అపోహలు, అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. జనవరి 1వ తేదీ నుంచి వరుసగా సెలవు దినాలు వచ్చాయని, నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతుబంధు స్కీమ్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడంలో కాస్త ఆలస్యమైందని అన్నారు. రైతు బంధు కింద ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.6,008.27 కోట్లు జమ చేశామని తెలిపారు. లబ్ధిదారుల జాబితాలో ఉన్న మిగిలిన రైతులందరికీ ఒకటి, రెండు రోజుల్లో రైతుబంధు నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




