ధాన్యం సేకరణపై పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించిన టీఆర్ఎస్ ఎంపీలు
admin November 29, 2021 0 COMMENTS
పార్లమెంట్లో తొలి రోజే రభస మొదలైంది. లోక్సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. వివాదాస్పద సాగు చట్టాల రద్దు బిల్లుకు రాజ్యసభ కూడా సోమవారం ఆమోదం తెలిపింది.ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలని స్పష్టం చేశారు. ఎంఎస్పీకి చట్టబద్ధత, సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో చనిపోయిన రైతులకు పరిహారం, తెలంగాణలో వరి కొనుగోళ్లపై స్పష్టత సహా పలు అంశాలపై విపక్ష ఎంపీలు చర్చకు డిమాండ్ చేశాయి. లోక్సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
RELATED ARTICLES
LEAVE A COMMENT




