
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపనున్నారు. రెండు, మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండనున్నారు. ధాన్యం కొనుగోలు, కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ కేటాయింపులు, రాష్ట్ర విభజన అంశాలపై ఈ పర్యటనలోకేంద్రంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. యాసంగి ధాన్యం ఎంత కొంటారో స్పష్టత ఇవ్వాలని ఇప్పటికే సిఎం కెసిఆర్ పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంత్రుల సమావేశంలో ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించిన విషయం విధితమే. ఈ క్రమంలో కేంద్రంతో తేల్చుకునేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్కుమార్… సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర మంత్రులను, అధికారులను కలవనున్నట్టు సమాచారం.
RELATED ARTICLES
LEAVE A COMMENT




