
అంతర్జాతీయ జియోడైవర్సిటీ డే-2022ను పురస్కరించుకొని, గణనీయమైన భౌగోళిక వైవిధ్యాన్ని మరియు భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషిచేస్తూ, మరింత సుస్థిర అభివృద్ధికి కొత్త మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రాంతంలోని జియో కల్చరల్ హెరిటేజ్ సైట్లను ఏడాది పొడవునా సందర్శించాలనే సంకల్పంలో భాగంగా దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వేదకుమార్, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు, చరిత్రకారులు, పౌరసమాజ సమూహాలతో కలిసి చారిత్రాత్మక బొమ్మలగుట్ట కొండను సందర్శించారు .
ఉమ్మడి రాష్ట్రం లో సరైన సంరక్షణ మరియు రక్షణ లేకపోవడం వల్ల, చక్రేశ్వరీ దేవి పాద ముద్రలు మరియు శిలాశాసనాలు నేలమట్టం చేయబడ్డాయి. అంతకు ముందు కూడా తెలంగాణ రెసోర్స్ సెంటర్ (TRC) ఇతర స్వచ్చంద సంస్థల మరియు వ్యక్తులతో బొమ్మలమ్మ గుట్టను పలుమార్లు సందర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చారిత్రాత్మక కొండ వైభవాన్ని, కీర్తి ని కాపాడటానికి మెట్ల మార్గాన్ని నిర్మించడం ద్వారా సరైన అప్రోచ్ రోడ్డు నిర్మాణానికై, ఇతర సౌకర్యాలను కల్పించడానికై నిధులు మంజూరు చేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టరు మరియు కుర్కియాల్ గ్రామ సర్పంచి శ్రీ.ఎం.నవీన్ రావు, (టి.ఆర్.ఎస్) చిత్తశుద్ధితో చేసిన కృషి మరియు నిబద్ధత ఈ స్థలాన్ని అభివృద్ధి చేయడం మరింత సౌకర్యవంతంగా ఈ స్థలం ప్రజలకు చేరువయ్యేలా చేయడంలో సఫలీకృతమైంది.
బొమ్మలమ్మగుట్ట పై చక్రేశ్వరీ దేవి క్రింద ఉన్నరాతిపై ఉన్న సంస్కృత, కన్నడ, తెలుగు భాషలలోని శాసనాలు. ఈ శాసనాలలోని చివరి మూడు శ్లోకాలు తెలుగుభాషలో తొలివిగా భావించే ఆధారాలుగా పండితులు ,కవులు .. తెలుగుకు క్లాసిక్ భాషా హోదాను సాధించడానికి ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా కేంద్రానికి సమర్పించారు. 2017లో తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక,వారసత్వ, శాఖల కృషితో తెలుగు భాషకు శాస్త్రీయ హోదా లభించింది.
ప్రొ.వేద కుమార్ తెలంగాణ ప్రభుత్వంకు చేస్తూన్న ఈ ప్రతిపాదనద్వారా కొండ చుట్టూ మరిన్ని ఎకరాల భూమిని సేకరించి, ఆ స్థలాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని, భారతదేశం మరియు విదేశాల నుండి పర్యాటకులను ఆకర్షించడానికి సైట్ వద్ద ఒక మ్యూజియంను కూడా అభివృద్ధి చేయడం, సంరక్షణ మరియు పునరుద్ధరణ చర్యలు చేపట్టి ప్రజల దర్శనార్థం అంకితం చేయాలని , తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు ఈ ప్రదేశంతో అనుబంధాన్ని పెంపొందించుకుంటారని తెలిపారు భవిష్యత్ తరాల కోసం దేశంతో పాటు దక్కన్ రీజియన్ యొక్క భౌగోళిక వైవిధ్యాన్ని(Geodiversity), భౌగోళిక వారసత్వాన్ని(geoheritage) పరిరక్షించిన వాళ్ళమవుతామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కుర్కియాల్ గ్రామ సర్పంచి శ్రీ.ఎం.నవీన్ రావు, పర్యావరణ వేత్తలు ఇంజినీర్ పి.రాంగోపాల్ రావు, ఇంజినీర్ సి.హెచ్. రవీందర్ రావ్, ఎం.నర్సింగ్ రావ్,సాగర్ రావ్, సుధాకర్, ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ సాగర్ మరియు గౌస్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు





