
హైదరాబాద్ నుంచి లండన్కు మొదటిసారి నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్టు ఎయిర్ ఇండియా బుధవారం వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా నుంచి నేరుగా లండన్ నాన్స్టాప్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఎయిర్ ఇండియా ఈ జాబితాలోకి హైదరాబాద్ను కూడా చేర్చింది. హైదరాబాద్ నుంచి లండన్కు ప్రతి సోమ, శుక్రవారాల్లో విమానం నడుస్తుందని పేర్కొంది. సోమవారం ఏఐ 147 విమానం హైదరాబాద్లో (భారత కాలమానం) రాత్రి 1.30 గంటలకు బయలుదేరి ఉదయం 7.30 గంటలకు (బ్రిటన్ కాలమానం) లండన్ చేరుతుందని తెలిపింది. ఈ విమానంలో మొత్తం 256 సీట్లు ఉంటాయి. వీటిటో 18 బిజినెస్ క్లాస్ కాగా, మిగతా 238 సీట్లు ఎకానమి క్లాస్ సీట్లు ఉంటాయి. ప్రతీ శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటలకు బయల్దేరే విమానం అదేరోజు 11:30 గంటలకు లండన్కు చేరుకోనుంది. ఇక లండన్ నుంచి AI 148 విమానం ప్రతీ ఆది, గురువారాల్లో హైదరాబాద్కు బయలు దేరనుంది.



